Tamil Nadu CM MK Stalin Hospitalised With Covid 19 For Observation - Sakshi
Sakshi News home page

MK Stalin Hospitalised: కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

Jul 14 2022 3:10 PM | Updated on Jul 14 2022 3:34 PM

Tamil Nadu CM MK Stalin Hospitalised With Covid 19 - Sakshi

రెండు రోజుల కిందట కరోనా వైరస్‌ బారిన పడ్డ ఎంకే స్టాలిన్‌.. ఆ లక్షణాలతోనే ఆస్పత్రిలో చేరారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్‌ అయ్యారు. 

కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, కాస్త అలసట, జ్వరంతో బాధపడుతున్నట్లు బులిటెన్‌లో తెలిపాయి ఆస్పత్రి వర్గాలు.

69 ఏళ్ల వయసున్న ఎంకే స్టాలిన్‌.. కొవిడ్‌-19 నిర్ధారణ కావడంతో మంగళవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ఆయన సైతం ప్రకటించారు.

తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌, సబ్‌ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. అయితే ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే నమోదు అవుతున్నాయని, త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement