ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Published
Wed, Mar 30 2022 9:22 PM
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా కూటమి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. బంగాళాఖాతం ప్రాంతం.. అనుసంధానత, భద్రతకు వారధిగా మారాలని పిలుపునిచ్చారు.