నేడు 47 కేంద్రాల్లో రోజ్‌గార్‌ మేళా | PM Narendra to Distribute Over 51,000 Appointment Letters Under Rozgar Mela | Sakshi
Sakshi News home page

నేడు 47 కేంద్రాల్లో రోజ్‌గార్‌ మేళా

Jul 12 2025 5:41 AM | Updated on Jul 12 2025 5:41 AM

PM Narendra to Distribute Over 51,000 Appointment Letters Under Rozgar Mela

51 వేల మందికి నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా కేంద్రం నేడు 16వ రోజ్‌గార్‌ మేళాను నిర్వహించనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 51 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.

 ఇప్పటి వరకు నిర్వహించిన 15 రోజ్‌గార్‌ మేళాల ద్వారా 10 లక్షల మందికి పైగా నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర ముఖ్యమైన శాఖల్లో ఈ నియామకాలను చేపట్టింది. శనివారం నియామక పత్రాల పంపిణీ అనంతరం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement