సభలో మోదీ మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య | Modi Modi Chanting In Siddaramaiah Presence In Bengaluru | Sakshi
Sakshi News home page

సభలో మోదీ మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సీఎం సిద్ధరామయ్య

Jan 19 2024 5:37 PM | Updated on Jan 19 2024 7:26 PM

Modi Modi Chanting In Siddaramaiah Presence In Bengaluru - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న ఒక కార్యక్రమంలో సభికులంతా ఒక్కసారిగా మోదీ మోదీ అని నినాదాలు చేశారు. 

దీంతో సిద్ధరామయ్య వైపు తిరిగిన మోదీ ‘ముఖ్యమంత్రీ జీ అయిసా హోతా రెహతా’ హే(ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి)అని సర్ది చెప్పారు. దీనికి సిద్ధరామయ్య కాస్త అసౌకర్యంగా నవ్వారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

దేశంలో ప్రధాని ​మోదీని, ఆయన విధానాలను గట్టిగా విమర్శించే నేతల్లో సిద్ధరామయ్య ఒకరు కావడం గమనార్హం. బోయింగ్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరు విచ్చేశారు. అనంతరం అక్కడ సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతుండగా సభలో ఒక్కసారిగా మోదీ మోదీ నినాదాలు మార్మోగాయి. 

ఇదీచదవండి.. బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement