‘నాన్నా క్షమించు.. పింకీ టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా’ | Karnataka Hubballi Peter Gollapalli And Pinky Case Full Details | Sakshi
Sakshi News home page

‘నాన్నా క్షమించు.. పింకీ వేధింపులు తట్టుకోలేకపోతున్నా’: భర్త ఆత్మహత్య

Jan 27 2025 7:58 PM | Updated on Jan 27 2025 8:27 PM

Karnataka Hubballi Peter Gollapalli And Pinky Case Full Details

బెంగళూరు: దేశంలో భార్యా బాధిత మరణాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య ఘటన మరువకముందే కర్ణాటక మరో వ్యక్తి ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్‌ రాసిపెట్టి చనిపోయాడు.

వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సందర్భంగా తన మరణానికి భార్య పింకీనే కారణం అంటూ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన పేరెంట్స్‌ను క్షమించమని కోరాడు. సూసైడ్‌ నోట్‌లో.. నాన్న, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక నేను చనిపోతున్నాను. తను నా మరణాన్ని కోరుకుంటోంది. అన్నయ్య జోయల్‌.. మన పేరెంట్స్‌ను బాగా చూసుకో’ అంటూ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతరం, పీటర్‌ చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్బంగా పీటర్‌ సోదరుడు జోయల్ మాట్లాడుతూ..పీటర్‌, పింకీ రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. గత కొద్ది నెలలుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, మూడు నెలలుగా వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. పీటర్‌ నుంచి పింకీ విడాకులు తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పీటర్‌ వద్ద పరిహారంగా రూ.20 లక్షలు డిమాండ్‌ చేసింది. దీంతో, పీటర్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. పింకీ వల్లే ఇటీవల పీటర్‌ తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆమె వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నట్టు తెలిపాడు.

పీటర్‌ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పీటర్‌ సూసైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పీటర్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడంపై వ్యవహరించే భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement