సైన్యాధికారిణిగా గల్వాన్‌ అమరుని అర్ధాంగి | Galwan Martyr Naik Deepak Singh Wife Joins India Army As Lieutenant | Sakshi
Sakshi News home page

సైన్యాధికారిణిగా గల్వాన్‌ అమరుని అర్ధాంగి

Apr 30 2023 5:26 AM | Updated on Apr 30 2023 7:12 AM

Galwan Martyr Naik Deepak Singh Wife Joins India Army As Lieutenant - Sakshi

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్‌ దీపక్‌ సింగ్‌ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్‌ రేఖా సింగ్‌.. ఆర్మీ ఆర్డ్‌నన్స్‌ కోర్‌ విభాగంలో శనివారం విధుల్లో చేరారు.

తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్‌ యూనిట్‌లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్‌ కోర్‌లో సభ్యుడైన నాయక్‌ దీపక్‌ సింగ్‌ ఆ తర్వాతికాలంలో బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్‌ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్‌ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది.

Advertisement
 
Advertisement
Advertisement