COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి | COP27 kicks off with deal to discuss climate compensation | Sakshi
Sakshi News home page

COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి

Nov 7 2022 6:06 AM | Updated on Nov 7 2022 6:06 AM

COP27 kicks off with deal to discuss climate compensation - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది.

ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్‌–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement