Mumbai-Goa Highway Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా 9 మంది మృతి

9 killed As Car Collides With Truck On Mumbai Goa Highway - Sakshi

ముంబై: మహారాష్ట్రలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్‌ జిల్లా మంగావ్‌ ప్రాంతంలోని ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితోపాటు తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రేపోలి గ్రామం వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితులందరూ బంధువులని, కారులో రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top