-
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా 9 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయ్గడ్ జిల్లా మంగావ్ ప్రాంతంలోని ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితోపాటు తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రేపోలి గ్రామం వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితులందరూ బంధువులని, కారులో రత్నగిరి జిల్లాలోని గుహగర్కు వెళ్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు. -
వాహనదారులకు అలర్ట్: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం
సాక్షి, ముంబై: గణేశోత్సవాలు సమీపించడంతో కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ముంబై–గోవా జాతీయ రహదారి–66పై రాయ్గఢ్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు వివిధ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముంబై, థానే సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాల నుంచి కొంకణ్లోని స్వగ్రామాలకు బయల్దేరిన భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రహదారి వెంబడి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రతకు ప్రధానపీట వేస్తూ అదనపు పోలీసు బలగాలతోపాటు హోం గార్డుల సాయం కూడా తీసుకున్నారు. ఇదివరకే ముంబై–గోవా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గణేశోత్సవాలు ముగిసే వరకు ట్రక్కులు, కంటైనర్లు, ట్యాంకర్లు, ట్రేలర్లు లాంటి భారీ వాహనాలకు నిషేధం విధించారు. ఇందులో కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసర సరుకులుచేసే వాహనాలకు మినహాయింపునిచ్చారు. దీన్నిబట్టి ముంబై–గోవా జాతీయ రహదారిపై ఏ స్థాయిలో వాహనాల రద్దీ ఉంటుందో ఇట్టే అర్థమైతోంది. 3,500 ప్రత్యేక బస్సులు కొంకణ్ రీజియన్లో ఏటా గణేశోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు ప్రతీ ఇంటిలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. దీంతో ఉద్యోగ, వ్యాపార రీత్యా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ స్థిరపడిన వారు గణేశోత్సవాలకు స్వగ్రామానికి చేరుకుంటారు. దీంతో ముంబై–గోవా జాతీయ రహదారి ఉత్సవాలు ముగిసేవరకు రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా గణేశోత్సవాలకు కొంకణ్, సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. వీటితోపాటు ఎమ్మెస్సార్టీసీ కూడా ఏటా 3,500 పైగా ప్రత్యేక బస్సులు వివిధ బస్ డిపోల నుంచి నడుపుతుంది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, జీపులు, ఇతర పికప్ వాహనాలు నడుస్తాయి. అయినప్పటికీ రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎటూ సరిపోవు. ఇప్పటికే ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వినాయక చవితి ఇంకా రెండ్రోజులే ఉండటంతో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని అంటున్నారు. కొంకణ్, సెంట్రల్ రైల్వే రీజియన్లు సంయుక్తంగా నడుపుతున్న 60–70 ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. వెయిటింగ్ లిస్టు 600–700 వరకు చేరుకుంది. దీన్ని బట్టి గణేశోత్సవాలకు ఏ స్థాయిలో ప్రజలు స్వగ్రామాలకు బయల్దేరుతారో స్పష్టమవుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గణేశోత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోయారు. దీంతో స్వగ్రామాలలో జరిగే ఉత్సవాలకు అనేకమంది హాజరు కాలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో స్వగ్రామాలకు బయల్దేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. జాతీయ రహదారిపై పూర్తయిన ఏర్పాట్లు రాయ్గడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ దుభే నేతృత్వంలో ముంబై–గోవా నేషనల్ హై వే–66పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి అవి ముగిసేవారు అంటే సెప్టెంబరు 9 వ తేదీ వరకు ఏకంగా 80% పోలీసులను ఈ రహదారిపై నియమించారు. ఖార్పాడా నుంచి పోలాద్పూర్ వరకు పది ప్రత్యేక పోలీసు సహాయ కేంద్రాలను నియమించారు. ఖార్పాడ నుంచి కశేలీ ఘాట్ సెక్షన్లో ఓ అప్పర్ సూపరింటెండెంట్, ఐదుగురు ఉప విభాగ అధికారులు, 11 మంది పోలీసు ఇన్స్పెక్టర్లు, 27 సబ్ ఇన్స్పెక్టర్లు, 225 కానిస్టేబుళ్లను నియమించారు. హోం గార్డు బృందాల సాయం కూడా తీసుకుంటున్నారు. ఘాట్ సెక్షన్లో ట్రాఫిక్ జామ్ కాకుండా 24 గంటలు వాకిటాకీల సాయంతో అప్రమత్తంగా ఉంటారు. ప్రమాదానికి గురైన వాహనాలను లేదా మరమ్మతుల నిమిత్తం రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల వల్ల ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు అక్కడక్కడా 18 హైడ్రాలిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. వీటి సాయంతో ఆగిపోయిన వాహనాలను రోడ్డు పక్కకు నెట్టేస్తారు. అదేవిధంగా 30 చోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే గాయపడిన ప్రయాణికులకు వెంటనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు పన్వేల్, పేణ్, మాణ్గావ్, మహాడ్, పోలాద్పూర్ తదితర ఉప జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించేందుకు 14 అంబులెన్స్లు కూడా ఉంచారు. ప్రమాదాలను నివారించేందుకు రాయ్గఢ్ జిల్లా పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు (వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.).... ►రాంగ్ సైడ్లో, వేగంగా వాహనాలు నడపకూడదు. ►సామర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేయరాదు. ►రోడ్డుకు ఇరువైపులా హెచ్చరికల బోర్డులను, ప్రమాదకర మలుపులను పరిశీలిస్తూ వాహనాలను నడపాలి. ►వాహనం నడుపుతున్న వారు అలసిపోయినా లేదా అలసట, నిద్ర వచ్చినా వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపివేసి విశ్రాంతి తీసుకోవాలి. ►సాధ్యమైనంత వరకు రాత్రి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి ►ముంబై–గోవా జాతీయ రహాదారిపై రద్దీని నియంత్రించేందుకు అందరూ ఒకే మార్గంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ రోడ్లను కూడా వినియోగించాలి. ►పార్కింగ్ చేయడానికి తగినంత స్థలం ఉన్న చోటే వాహనాలను ఆపండి. రోడ్డుపై లేదా రోడ్డుకు ఆనుకుని పార్కింగ్ చేయవద్దు ►డాబాలు, హోటళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయే విధంగా వాహనాలు నిలుపకూడదు. ►అత్యవసర సమయంలో పోలీసులు, సహాయక బృందాల సాయం తీసుకోవాలి. -
ఏడుగురి ప్రాణాలు తీసిన అతివేగం
ముంబై : అతివేగం ఏడుగురు వ్యక్తుల ప్రాణాలు తీసింది. రత్నగిరి జిల్లాలో ముంబై-గోవా జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి గోవా వైపు వెళుతున్న గ్జైలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన ఏడుగురు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రత్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనూ గ్రామ సమీపంలో ఈ సంఘన చోటు చేసుకుంది. డ్రైవర్ అతివేగంగా కారును నడపడం వల్లే కంట్రోల్ చేయలేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన సహాయకచర్యల్లో పాల్గొన్నారు. అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు రత్నగిరి సివల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతిచెందిన వారిలో ప్రశాంత్ గౌరవ్, సచిన్ సావంత్, అక్షయ్ కారేకర్, మయూర్ పెద్నేకర్, నిహాల్ కోలేకర్, కేదార్ కోలేకర్, వైభవ్ మానవెలు ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కూలిన బ్రిడ్జ్ : బస్సు, కార్లు గల్లంతు
ముంబై: మహారాష్ట్రలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలింది. ఈ వరద ధాటికి నాలుగు బస్సులు, రెండు కార్లు గల్లంతయ్యాయి. అయితే సదరు బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి... సహాయక చర్యలు చేపట్టాయి. ముంబై - గోవా జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement