తొమ్మిది మంది దుర్మరణం
32 మందికి గాయాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ : హరియాణాలోని ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్ సభ్యుల స్థావరం నుంచి వందల కేజీల పేలుడు రసాయనాలను స్వా«దీనంచేసుకుని అరెస్టుల పర్వానికి తెరలేపి విజయవంతంగా దూసుకుపోతున్న జమ్మూకశ్మీర్ పోలీసులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. నిబంధనావళి ప్రకారం పేలుడు పదార్థాల నుంచి కొంతమేర శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపేందుకు ప్రయతి్నస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోయి 9 మంది ప్రాణాలను బలిగొంది. మరో 32 మంది సైతం గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన వారిని శ్రీనగర్లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్సనందిస్తున్నారు. శ్రీనగర్ శివారులోని నౌగామ్ పోలీస్స్టేషన్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దాడి చేసింది తామేనని తొలుత ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోగా అసలు దాడే జరగలేదని, అది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు అని జమ్మూకశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్ శనివారం మధ్యాహ్నం స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి 11.20గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్స్టేషన్ భవనం దారుణంగా దెబ్బతింది. సమీప భవనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటన వివరాలను నళిని ప్రభాత్తోపాటు కేంద్రహోంశాఖ కార్యదర్శి(కశ్మీర్) ప్రశాంత్ లోఖండే ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
A massive explosion occurred inside the Nowgam Police Station in Srinagar, Jammu and Kashmir.
Blast happened when the FSL team along with Police and Tehsildar were inspecting the large Ammonium Nitrate explosive which was confiscated earlier.
Nowgam Police had recently… pic.twitter.com/71bc4IpVkw— Intel Sage 🇮🇳 (@IntelSage) November 14, 2025
అసలేమైంది?
వైద్యుల ముసుగులో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ షాహీన్, డాక్టర్ ముజామిల్ తదితరులు అక్రమంగా సేకరించిన వందల కేజీల పేలుడు పదార్థాలను నవంబర్ 9, 10 తేదీల్లో జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసు బృందం ఫరీదాబాద్లో సంయుక్తంగా పట్టుకోవడం తెల్సిందే. వీటిని జాగ్రత్తగా ఒక పికప్ ట్రక్కులో చిన్నచిన్న సంచుల్లో శ్రీనగర్కు తీసుకొచ్చి నౌగామ్ పోలీస్స్టేషన్లో ఓపెన్ఏరియాలో పెట్టారు. ఆ పదార్థాన్ని ఎన్ని రకాల పేలుడు రసాయనాల మిశ్ర మంగా తయారుచేశారో తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు సిద్ధమయ్యారు.
ఇందుకోసం ఒక బృందం రంగంలోకి దిగి ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) ప్రకారమే శాంపిళ్లను సేకరించడం మొదలెట్టారు. అయితే అవి అత్యంత విస్ఫోటక స్వభావం కల్గిఉండటంతో అనూహ్యంగా పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ టీమ్లోని ముగ్గురు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, మేజి్రస్టేట్ బృందంలోని ఇద్దరు రెవెన్యూ శాఖ అధికారులు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి, ఒక టైలర్ చనిపోయారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులుసహా 27 మంది గాయపడ్డారు. చాలా సూట్కేసుల్లోని పేలుడుపదార్థాల నుంచి శాంపిళ్ల సేకరణ ప్రక్రియ గత రెండ్రోజులుగా కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.
ఏకాకిగా మారిన దర్జీ కుటుంబం
పోలీస్స్టేషన్లో చిన్న ప్యాకింగ్ పని ఉందని రమ్మంటే వెళ్లిన స్థానిక టైలర్ మొహమ్మద్ షఫీ పారీ మళ్లీ తిరిగిరాలేదు. పేలుడు ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం అనాథగా మారింది. 47 ఏళ్ల షఫీకి స్థానికంగా ఎంతో మంచి పేరుంది. మసీదులో కార్యక్రమాల కోసం విరాళాలు సేకరిస్తారు. చుట్టుపక్కల వాళ్లను ప్రేమగా పలకరిస్తాడు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.


