
నేడు ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ సదస్సు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో శుక్రవారం ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ పేరిట ఒక రోజు సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వర్క్షాపును పరిశీలించేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి మహబూబ్నగర్ రానున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి నవీన పద్ధతులను అవలంబించే విధానాలపై చర్చించనున్నారు. దీనికి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషన్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తప్పక హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఈపాటికే ఈ సదస్సు నిర్వహణకు స్థానిక మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలోని స్టాల్స్తో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్, సమావేశ హాలు, ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు.
ముఖ్య అతిథిగా హాజరుకానున్నసీడీఎంఏ టీకే శ్రీదేవి
పాల్గొననున్న రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు