యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 20 2025 6:55 AM | Updated on Jun 20 2025 6:55 AM

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

నారాయణపేట ఎడ్యుకేషన్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని డీఈఓ గోవిందరాజులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో జిల్లాలోని అందరూ ఎంఈఓలు, డీపీఎం, సీసీ, వీవోలకు ఎన్‌ఐఎల్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించి వారి అక్షరాస్యులుగా చేసే బాధ్యత వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్‌ విషయంలో ఏదైనా జాప్యం జరిగితే శనివారం లోగా అందజేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో అదేరోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే యోగా చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ మొగులప్ప, విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ రాజేంద్రకుమార్‌, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement