
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట ఎడ్యుకేషన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని డీఈఓ గోవిందరాజులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జిల్లాలోని అందరూ ఎంఈఓలు, డీపీఎం, సీసీ, వీవోలకు ఎన్ఐఎల్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించి వారి అక్షరాస్యులుగా చేసే బాధ్యత వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ విషయంలో ఏదైనా జాప్యం జరిగితే శనివారం లోగా అందజేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో అదేరోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే యోగా చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, విద్యాశాఖ కో ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.