
నూతన జిల్లా ఆస్పత్రిలో తొలి సిజేరియన్
నారాయణపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాల,జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆపరేషన్ థియేటర్లో క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. బుధవారం పెరవళ్ల గ్రామానికి చెందిన నిండు గర్భిణి ప్రసవం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిందని, డాక్టర్లు పరీక్షించగా కడుపులో శిశువు అడ్డంగా ఉందని గుర్తించారని తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తేజస్విని, మహేంద్రవర్మ ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ అత్యవసర ఆపరేషన్ నూతన ఆస్పత్రిలో మొదటిది అని ఆయన తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్య బృందానికి బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.