
రమణీయం.. రథోత్సవం
కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్యదైవమైన గురులోకామసంద్ ప్రభు బావాజీ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం కనులపండువగా సాగింది. బంజారాల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల నృత్యాలు, భజనల నడుమ రథం ముందుకు కదిలింది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురులోకామసంద్ ప్రభు బావాజి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, స్వామి వారి పల్లకీసేవ నిర్వహించారు. శనివారం నుంచే వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ పూజారులు చందర్ నాయక్, బీంమ్లానాయక్ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు లాగారు. అంతకుముందు బావాజి, కాళికాదేవికి భక్తులు బెల్లంతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూణె గ్రూప్ అసోషియేషన్ అన్నదానం చేశారు. ఇదిలాఉండగా, రథోత్సవంలో ఆర్డీఓ రాంచందర్ చేసిన కత్తి విన్యాసం ఆకట్టుకుంది. పోలీసుల పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్టీ సెల్ సాయకులు దేవులానాయక్, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది బీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సిములు, రఘుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బావాజీ జాతరకు
తరలివచ్చిన భక్తజనం
ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం