
నారాయణపేట
జై హనుమాన్..
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నారాయణపేటలో వీరహనుమాన్ శోభాయాత్రలో జన సందోహం
● జిల్లా కేంద్రంలో
కనులపండువగా
శోభాయాత్ర
నారాయణపేట: జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర శనివారం కనులపండువగా సాగింది. భజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్థానిక బారంబావి దగ్గర హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి గుండా చౌక్కు చేరుకొని గణేశ్ మార్గ్గా మహంకాళి వీధి నుంచి పాతగంజ్ వరకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని నృత్యాలు, భజనలు చేసుకుంటూ ముందుకు సాగారు. డీజే పాటలు, టపాకాయలు కాల్చుతూ.. జైశ్రీరామ్.. జై హనుమాన్.. జై భజరంగ్భళి నినాదాలతో పురవీధులు మార్మోగాయి. కార్యక్రమంలో వీహెచ్పీ ప్రముఖ్ హరిశ్చంద్రరెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్కుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, మాజీ ఎంపిపి అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, భజరంగ్దళ్ సభ్యులు, వీహెచ్పీ సభ్యులు పాల్గొన్నారు.

నారాయణపేట