కోవిడ్ తర్వాత థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 3 శాతం వరకు థైరాయిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తోంది. ఇమ్యూన్ డెఫిసెన్సీతో థైరాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీకి 100 మంది థైరాయిడ్ రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఈ లెక్కన నెలకు 800, సంవత్సరానికి దాదాపు 9వేల మంది దాకా చికిత్స తీసుకుంటున్నారు. పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లోనూ థైరాయిడ్ కనిపిస్తోంది. దీనిని కంజెంటెనల్ థైరాయిడ్గా పేర్కొంటాం. – డాక్టర్ పి.రాధారాణి,
ఎండోక్రైనాలజిస్టు, జీజీహెచ్, కర్నూలు


