సిబ్బంది.. ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది.. ఇబ్బంది

Apr 25 2025 1:02 AM | Updated on Apr 25 2025 1:02 AM

సిబ్బ

సిబ్బంది.. ఇబ్బంది

గోస్పాడు: ఓ సాధారణ వ్యక్తి అద్దె ఇల్లు మారాల్సి వస్తే కనీస సౌకర్యాలు చూసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తాడు. అదే ఓ కార్యాలయాన్ని మరో చోటుకు తరలించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికార, సిబ్బందికి సౌకర్యాలు ఉన్నా యా.. లేవా అని చూసుకోవాలి. కానీ పంచాయతీ రాజ్‌ శాఖలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆ శాఖలో భాగమైన పీఐయూ (ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్‌ యూనిట్‌) కార్యాలయం ఎంతో కాలంగా ఉమ్మడి జిల్లా కేంద్రమైన కర్నూలులోనే కొనసాగేది. అయితే నంద్యాల జిల్లా కేంద్రం కావడంతో ఈ కార్యాలయం ఇక్కడికి రావాల్సిన అవసరముందని గుర్తించిన అధికారులు హడావుడిగా తరలించారు. ఈ మేరకు ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చేసేదిలేక సిబ్బంది కార్యాలయ సామగ్రిని తెచ్చి స్థానిక పీఆర్‌ కార్యాలయంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేశారు. ప్రస్తుతం ఉన్న పీఆర్‌ జిల్లా ఇంజినీరింగ్‌ అధికారి కార్యాలయం పైన ఉన్న ఓ గదిని పీఐయూ కార్యాలయానికి కేటాయించారు. దీంతో సిబ్బంది సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. కనీసం కార్యాలయం మార్పుచేస్తున్నట్లు ఉన్నతస్థాయి అధికారులకు తెలియకుండానే జరుగుతుందా, తరలిస్తే కనీస వసతులు ఉన్నాయా? లేవా? అనే ఆలోచన ఏమాత్రం చేయకుండానే ఇలాంటి మార్పు చేయ డం ఏమిటని పలువురు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

సమాచారం లేకుండానే..

జిల్లాకు సంబంధించిన పీఐయూ కార్యాలయం కావడంతో అందులో దాదాపుగా 23 మందికి పైగానే సిబ్బంది పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, డీఈ స్థాయి పీఏ, డీఏఓ, సూపరింటెండెంట్‌లు ఒక్కొక్కరు చొప్పున, ముగ్గురు ఏఈలు, రికార్డు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు నలుగురు చొప్పున, ఇద్దరు టైపిస్టులు, టెక్నికల్‌, బీపీఓలు ఒక్కొక్కరితో పాటు అటెండర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే పనిచేసే వారిలో మహిళా సిబ్బంది దాదాపుగా 10 మంది ఉన్నారు. కార్యాలయాన్ని కర్నూలు నుంచి నంద్యాలకు తరలించే సమయంలో అక్కడున్న సిబ్బందికి మాట మాత్రమైనా సమాచారం లేకుండా హడావిడిగా తరలించడంతో అవస్థలు పడుతున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న కార్యాలయంలో పని చేయలేక అవస్థలు పడుతున్నారు.

ఓ వైపు పనులు.. మరో వైపు విధులు..

అసలే నంద్యాల కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రం కావడంతో కార్యాయాలకు భవనాల కొరత ఉందన్న విషయాన్ని సైతం అధికారులు మర్చిపోయారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వస తులు ముందస్తుగా ఏర్పాటు చేసుకోకుండా ఆర్భాటాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు కార్యాలయానికి రంగుల పూత వేస్తుండటంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తూ కనిపించారు. దీంతో కార్యాలయానికి అక్కడి నుంచి తెచ్చిన టేబుళ్లు, బల్లలు, కుర్చీలు ఉంచే స్థలం లేక ఎక్కడపడితే అక్కడ వేశారు. ఇదిలా ఉండగా సిబ్బంది మాత్రం ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు.

భవన నిర్మాణానికి ప్రతిపాదనలు..

పీఐయూ కార్యాలయానికి ఏప్రిల్‌ నెలలోనే నూతన భవన నిర్మాణానికి రూ. 34 లక్షలతో ప్రతిపాదన చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు చేసిన పనులు మంజూరై పనులు ప్రారంభించి భవన నిర్మాణం పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కనీసం సిబ్బంది కూర్చోవడానికి, కార్యాలయానికి సంబంధించిన టేబుళ్లు, బల్ల లు, కుర్చీలు ఉంచేందుకు అనుగుణంగా ఏర్పా టు చేయాలని కోరుతున్నారు.

హడావుడిగా పీఐయూ

కార్యాలయం మార్పుతో అవస్థలు

కర్నూలు నుంచి నంద్యాల

కేంద్రానికి తరలింపు

సిబ్బంది కూర్చోవడానికి సరైన

వసతులు కరువు

సిబ్బంది.. ఇబ్బంది1
1/2

సిబ్బంది.. ఇబ్బంది

సిబ్బంది.. ఇబ్బంది2
2/2

సిబ్బంది.. ఇబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement