
గో బ్యాక్ జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత దేశ పర్యటనను నిరసిస్తూ ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. భారత ఉత్పత్తులపై పెంచిన పన్నులను తగ్గించే వరకు దేశంలో పర్యటించకూడదన్నారు.
క్వింటా పత్తి రూ.8,179
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం పత్తి ధర రూ.8,179 పలికింది. గత వారంలో రూ.8వేలు ఉండింది. సోమవారం 661 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.8,179, మధ్య ధర రూ.7,589, కనిష్ట ధర రూ.4,509 నమోదైంది.
● వేరుశనగకాయలు 988 సంచులు రాగా గరిష్ట ధర రూ.6,626, మధ్య ధర రూ.6,336, కనిష్ట ధర రూ.3,199 పలికింది.
● ఆముదాలు 30 సంచులు రాగా గరిష్ట ధర రూ.5,892, మధ్య ధర రూ.5,892, కనిష్ట ధర రూ.5,290 వచ్చింది.
● పూల విత్తనాలు నాలుగు సంచులు రాగా గరిష్ట ధర రూ.3,200, కందులు 20 సంచులు రాగా గరిష్ట ధర రూ.4,822 నమోదైంది.
కరువు మండలాల్లో
మొదలైన ఎన్యూమరేషన్
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 రబీ కరువు మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్ మొదలైంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోపు జిల్లా కలెక్టర్ ద్వారా పంట నష్టంపై ఎస్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ కోసం నివేదిక పంపాలని వ్యవసాయ శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కేవలం వర్షాధారం కింద సాగు చేసిన పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. ఒక రైతుకు 5 హెక్టార్ల వరకు మాత్రమే నమోదు చేయాలని, దెబ్బతిన్న పంటలు ఈ–క్రాప్లో నమోదై ఉండాలని సూచించారు. జిల్లాలో కల్లూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, గూడూరు, ఓర్వకల్లు, ఆస్పరి, వెల్దుర్తి, మద్దికెర, పత్తికొండ మండలాలను ప్రభుత్వం రబీ కరువు మండలాలుగా గుర్తించింది.