నకిరేకల్ : అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆసంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్ శుక్రవారం నకిరేకల్లో ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా జాల్వ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా గజ్జి రవి, వేముల శంకర్, జిల్లా ప్రదాన కార్యదర్శిగా అంబటి చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా సిలువేరు జానయ్య, అంబటి క్రిష్ణమూర్తి, కోశాధికారిగా పుట్ట సత్తయ్య, సభ్యులుగా బీరెడ్డి సత్తిరెడ్డి, కల్లూరి అయోధ్య, ముస్కు అనంతరెడ్డి, కుంభం వెంకటేషం, బూరుగు సత్తయ్య, అంబటి నర్సయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు.


