
రథచక్రాలు
కదిలిన రాములోరి
పకడ్బందీగా వరిధాన్యం కొనుగోళ్లు
● అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం
● జనసంద్రమైన సిర్సనగండ్ల
● మార్మోగిన శ్రీరామ నామం
వివరాలు 8లో u
– చారకొండ
నాగర్కర్నూల్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు పగడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యాసంగి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో 2,87,297 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు. ఇందుకోసం జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో 70, మెప్మా 4, పీఏసీఎస్ 160 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాల్ రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరతోపాటు సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ నెల 15లోగా 234 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కేంద్రానికి ధాన్యం వచ్చినప్పటి నుంచే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సన్నాలు, దొడ్డురకం వేర్వేరుగా కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు తాగునీరు, షామియానా, కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలను ట్యాబ్లో ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా చూడాలని, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వరిధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియ భాగంగా ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రవికుమార్, కల్పన తదితరులున్నారు.

రథచక్రాలు