
ఈదురు గాలుల బీభత్సం
కొల్లాపూర్: పట్టణంలో మంగళవారం సాయంత్రం అకాలవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆర్డీఓ కార్యాలయంలో చెట్టు కొమ్మలు విరిగి కార్లపై పడటంతో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల కారణంగా మామిడితోటల్లో కాయలు రాలాయి. వరిదేల మాసూంబాబా దర్గా ముందు గల హైమాస్ట్ లైట్ విద్యుత్ స్తంభం విరిగి వైర్ల పడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మతు చేపట్టగా.. కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా పంటలు, పండ్లతోటలు ఏమైనా దెబ్బతిన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.

ఈదురు గాలుల బీభత్సం