
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
ఎస్ఎస్తాడ్వాయి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మతిపోయేలా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి వియవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా పార్టీ నాయకులతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, జిల్లా నాయకుడు జగదీశ్, మాజీ మండల అధ్యక్షుడు మోహన్రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ ఇంద్రాసేనారెడ్డి, నాయకులు ఎండీ రఫీక్, కొర్నెబెల్లి శేషగిరి, పత్తి గోపాల్రెడ్డి, నగేశ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ కోట సురేశ్ పాల్గొన్నారు.