
నివేదిక ఆధారంగా నష్టపరిహారం
ములుగు : అకాల వర్షంలో నష్టపోయిన ప్రతి రైతుకు అధికారుల నివేదిక ఆధారంగా పరిహారం అందుతుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్గౌడ్ పేర్కొన్నారు. అలాగే రైతులకు అండగా ఉంటానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టంపై సర్వే చేసి వెంటనే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని చెప్పారు. ఈదురుగాలులతో కూలిపోయిన ఇళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్, పౌడాల ఓం ప్రకాశ్, కూనూరు అశోక్గౌడ్, ముసినపల్లి కుమార్గౌడ్, కక్కెర్ల అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్రెడ్డి, నెల్లుట్ల రాజన్న, అనిల్, నూనేటి శ్యాం, మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ షర్పోద్దీన్, వీరస్వామి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుంటోజు పావని నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కిసాన్ సెల్
జిల్లా అధ్యక్షుడు రాజేందర్గౌడ్