నేడు డయల్‌ యువర్‌ డీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ డీఎం

Apr 11 2025 1:02 AM | Updated on Apr 11 2025 1:02 AM

నేడు

నేడు డయల్‌ యువర్‌ డీఎం

ములుగు రూరల్‌: జిల్లా పరిధిలో నేడు(శుక్రవారం) నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్‌–2డిపో మేనేజర్‌ జోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సమస్యలపై శుక్రవారం మధ్యాహ్నాం 12నుంచి ఒంటిగంట వరకు సెల్‌ నంబర్‌ 9959336048కు ఫోన్‌ చేసి తెలపాలని వివరించారు. ప్రయాణికులు సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

నేడు విద్యుత్‌ వినియోగదారుల లోకల్‌ కోర్టు

ములుగు: మల్లంపల్లి మండలకేంద్రంలోని 35/11కేవీ సబ్‌స్టేషన్‌ ఆవరణలో నేడు(శుక్రవారం) విద్యుత్‌ వినియోగదారుల లోకల్‌ కోర్టు నిర్వహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం వరంగల్‌ చైర్‌పర్సన్‌ ఎన్‌వీ.వేణుగోపాలచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ, సర్వీస్‌ పేరు, కేటగిరి మార్పు, సర్వీసు రద్దు అంశాలపై వినియోగదారులు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎదిర పీహెచ్‌సీ పరిశీలన

వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఎదిర వైద్యశాలతో పాటు చొక్కాల, వెంకటాపురం సబ్‌ సెంటర్లను గురువారం జిల్లా క్వాలిటీ మేనేజర్‌ శరత్‌, క్వాలిటీ మోనిటర్‌ సాయిచంద్‌లు పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలపై ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహారెడ్డి, పవన్‌, సిబ్బంది యాకలక్ష్మి, రామలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.

‘మహాసభలను

విజయవంతం చేయాలి’

కన్నాయిగూడెం: ఆదివాసీల హక్కుల పోరాట మహాసభలను విజయవంతం చేయాలని సంఘం డివిజన్‌ అధ్యక్షుడు పొడెం శోభన్‌ గురువా రం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 12,13,14 తేదీల్లో కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగే మహాసభలకు ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

ఉచిత కంటి పరీక్షలు

కన్నాయిగూడెం: మండల పరిధిలోని ముప్పనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు చేయించారు. ముప్పనపల్లిలోని 1,2,3,4 అంగన్‌ వాడీ కేంద్రాల్లోని 6ఏళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు చేయించినట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పవతి తెలిపారు. పిల్ల లకు దృష్టిలోపం, బరువు, పోషక లోపం వంటివి గుర్తించి తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో కంటి వైద్యులు తిరుపతి, ఆర్‌బీఎస్‌కే నోడల్‌ అధికారి నరహరి, ఫార్మసిస్ట్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం 
1
1/1

నేడు డయల్‌ యువర్‌ డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement