
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
ఏటూరునాగారం: యువత డ్రగ్స్కు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ రేణుక అధ్యక్షతన డ్రగ్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డ్రగ్స్పై అవగాహన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు కళాశాల, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాటిని తీసుకోవడం ద్వారా సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని తెలిపారు. యువత చెడు మార్గంలో పయనించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రణాళికతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ అనుముల శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్, కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, డాక్టర్ సుమలత, ఎస్సై తాజుద్దీన్లు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ సీహెచ్.వెంకటయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి