ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Apr 10 2025 1:24 AM | Updated on Apr 10 2025 1:24 AM

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌ : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ బూరుగు రవి కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జిల్లా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఉద్యోగుల పెండింగ్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉద్యోగులతో సదస్సు, రాష్ట్రస్థాయిలో మహాధర్నాకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతకుముందు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ నూతన చైర్మన్‌గా బూరుగు రవి, ప్రధాన కార్యదర్శిగా శైలజ, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌గా రేగురి సుభాకర్‌రెడ్డి, దశరథ్‌, సందాని, భార్గవ్‌, ప్రవీణ్‌, కోకన్వీనర్లుగా శంకరయ్య, సేవానాయక్‌, రఘువీర్‌, కిరణ్‌, వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించారు.

టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement