Vijaya Shanti : 'ఏమో ఏమో' సాంగ్‌ని రిలీజ్‌ చేసిన విజయశాంతి

Vijaya Shanti Released Emo Emo Song From Parari Movie - Sakshi

యోగేశ్వర్,అతిథి  జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఏమో ఏమో సాంగ్‌ని లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

సాంగ్‌ లాంచింగ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ..తను రాసిన పాటను విజయశాంతి చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. మార్చి 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతందన్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top