
‘మిస్ ఇండియా’ ఊర్వశీ రౌతేల హీరోయిన్గా సంపత్ నంది క్రియేట్ చేస్తున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఊర్వశీ రౌతేల మా కథ విని, ఇంప్రెస్ అయ్యి ‘బ్లాక్ రోజ్’ చేయడానికి అంగీకరించారు. ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయనున్నాం’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘షేక్స్పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్గా ‘బ్లాక్ రోజ్’ తీస్తున్నాం. ‘విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ను జోడిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ.