Police Case File On Mythri Movie Makers And Shreyas Media, Deets Inside - Sakshi
Sakshi News home page

‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు

Jun 11 2022 11:00 AM | Updated on Jun 11 2022 12:35 PM

Case File On Mythri Movie Makers And Shreyas Media - Sakshi

అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌, శ్రేయాస్‌ మీడియాపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని గురువారం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా వెళ్లారు.

(చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ)

అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్‌ మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్‌ మీడియా ఈవెంట్‌ మేనేజర్‌ సురేశ్‌తో పాటు మైత్రీ మూవీస్‌పై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement