
బిగ్బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)
దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్)
