breaking news
Bigg Boss Telugu
-
బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?
బిగ్బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్గా జరిగింది.కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
బిగ్బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!
ఈసారి బిగ్బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్బాస్పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్లో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్లా సంజనా) -
బిగ్బాస్ నామినేషన్స్.. కామనర్స్పై రెచ్చిపోయిన టెనెంట్స్!
బిగ్బాస్ మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కామనర్స్ నుంచి మర్యాద మనీశ్ హౌస్కు గుడ్ బై చెప్పేశాడు. ఇక మూడో వారం మొదటి రోజే హౌస్ మరింత హాట్హాట్గా మారిపోయింది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఓనర్స్, టెనెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఎంత హీటక్కిపోయిందో అర్థమవుతోంది.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు నువ్వు గేమ్లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. పక్కనోడి పర్సనల్ పాయింట్తో నాకేంటి? అంటూ గట్టిగానే కౌంటరిచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య చిన్నపాటి గొడవను తలపించింది. నువ్వు వెళ్లు అని శ్రీజ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి అంటూ రీతూ మండిపడింది. దీంతో వెంటనే మాస్క్ మ్యాన్ హరీశ్ ఎంట్రీ ఇచ్చాడు. మనందరినీ నామినేషన్స్లో పెట్టడమే వారి ఉద్దేశమని అన్నారు. దీనిపై రీతూ చౌదరి మరోసారి ఆవేశంతో ఊగిపోయింది. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఏ రేంజ్లో జరిగిందో అర్థమవుతోంది. Nominations heat rising! Owners and Tenants go head-to-head! 👁️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/CGio3EffLF— Starmaa (@StarMaa) September 22, 2025 -
‘ఏఐ కాదు..పక్కా ఒరిజినల్’..బిగ్బాస్ బ్యూటీ పిక్స్ వైరల్
-
బిగ్ బాస్ లోకి రీతూ చౌదరి ఫిక్స్..!
-
బిగ్బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్గా పాల్గొన్నాడు. రన్నరప్గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
బిగ్బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్) -
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
శోభా శెట్టి బర్త్డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
ముసలమ్మలా మారిపోయిన హాట్ బ్యూటీ అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)


