breaking news
Bigg Boss Telugu
-
వేరేలా కష్టపడొచ్చుగా.. హిజ్రాల తీరుపై బిగ్బాస్ అరియానా
గ్రామాల్లో తక్కువగానీ నగరాల్లో అయితే కొత్తగా ఇంటి గృహప్రవేశం చేస్తున్నా షాపు ఓపెనింగ్ చేస్తున్నా సరే గుంపుగా కొందరు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఒకవేళ ఇవ్వం అని అంటే నానా రచ్చ చేస్తారు. అందుకే వీళ్లకు భయపడి చాలామంది అడిగినంత డబ్బులు ఇచ్చేస్తుంటారు. రీసెంట్ టైంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని బిగ్బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.'నాకు నిజంగా తెలీదు ఇది ఎలా వెళ్తుందోనని. నా మనసులో ఉన్నది ఓసారి మీతో పెంచుకోవాలనుకుంటున్నాను. సరిగానే మాట్లాడుతున్నానో లేదా తప్పుగా మాట్లాడుతున్నానో తెలీదు కానీ ఇది నా మనసులో ఉంది. మనం చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటాం లేదంటే బిజినెస్ కోసం ఏదైనా షాప్ ఓపెన్ చేస్తాం. రూపాయి రూపాయి డబ్బు కూడబెట్టి గృహప్రవేశం వరకు వెళ్తాం. ఇంట్లో పూజ జరుగుతుందన్నప్పుడు.. అంతెందుకు మా ఇంటి గృహప్రవేశం టైంలోనూ ఇది జరిగింది. అప్పటికే డబ్బులన్నీ సెట్ చేసుకుని కార్యక్రమం చేసుకున్నాం. సడన్గా వస్తారు. బయట నంబర్ రాస్తాం. డబ్బులివ్వాలి అని అంటారు. లేదంటే మా వాళ్లు వస్తారు మాకు కమీషన్ మిగలదు అంటారు. మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. పూజ చేసుకున్నాం. అలాంటప్పుడు వాళ్లొచ్చి ఇంత డబ్బులు అంత డబ్బులు అని డిమాండ్ చేస్తుంటారు. ఆ టైంలో నిజంగా రూ.3 వేలైనా, రూ.10 వేలైనా సరిపోవు. రూ.25 వేలు అంటారు. రూ.50 వేలు అంటారు. రూ.లక్ష 16 వేలని అంటారు. ఇదంతా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది''మంచి రోజు. మనం కష్టపడి మరీ కట్టుకున్నాం. ఈ రోజు కోసమే మనం ఇంతలా కష్టపడింది అన్నప్పుడు సడన్గా పూజ అవుతున్నా సరే పట్టించుకోకుండా ఓ అప్పులోళ్లలా వచ్చి ఎగబడతారు. అసలు ఎగబడి ఇచ్చే ఆశీర్వాదం ఏంటని నాకు అర్థం కాలేదు. నంబర్ రాస్తే వేరే వాళ్లు రారు. ఇప్పుడు ఇవ్వకపోతే మిగతావాళ్లు వస్తారు. మాకు కమీషన్ మిగలదు అనడం ఏంటి? వేరేలా కూడా కష్టపడొచ్చు కదా! సంపాదించుకోవచ్చు కదా అనేది నా ఫీలింగ్. పూజ జరుగుతుంటే బ్యాడ్ వైబ్స్ ఇవ్వడం ఎందుకు? ఇదంతా ఎవరికీ హర్ట్ చేయాలని కాదు. నేను ఫీలైనది చెబుతున్నాను' అని అరియానా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) -
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
ప్రస్తుతం 'బిగ్బాస్' అగ్నిపరీక్ష షో ప్రసారమవుతోంది. అయితే దీని జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. తన చావుకు నవదీప్ కారణమని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరుని విమర్శిస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు నవదీప్ స్పందించాడు. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి కామెంట్స్కి కౌంటర్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)'బిగ్బాస్ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఓ షో. 100 మంది రకరకాల మనస్తతత్వాల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఆ మాటలని ఎలా తీసుకుంటాం, ఎలా కంట్రోల్ చేసుకుంటామనేదే పాయింట్. దానిని పరీక్షించడానికే మమ్మల్ని జడ్జిలుగా పెట్టారు. వచ్చిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్పై ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకే వాళ్ల సహనాన్ని పరీక్షిస్తాం. కంటెస్టెంట్ స్పందన ఎలా అయినా ఉండొచ్చు. జడ్జిగా వెళ్లే ముందే నాకు ఆ విషయం తెలుసు. హారర్ సినిమాకు వచ్చి బయపెట్టొద్దు అంటే ఎలా? ఎవరు ఎన్ని మాటలు అన్నా తట్టుకుని నిలబడాలనేదే ఈ కాన్సెప్ట్. 'అగ్నిపరీక్ష' అంటేనే ట్రిగర్ చేయడం. నా లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నిలబడే శక్తి ఉందా? ఉంటేనే రండి. అగ్నిపరీక్ష డిజైన్ చేసిందే దానికోసం. అలా తట్టుకుని నిలబడేవాళ్లే షోకు రండి లేదంటే రావొద్దు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) View this post on Instagram A post shared by Nav Deep 2.0 (@pnavdeep) -
బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్బాస్ ఒకటి. ఇప్పటివరకు 9 సీజన్లు జరగ్గా 7వ సీజన్ విజేతగా రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే తను గెలుచుకున్న డబ్బుని రైతులకు పంచుతానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తీరా చూస్తే అలాంటిదేం చేయలేదు. అసలు ఏమైంది అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే షో నిర్వహకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రైజ్మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు. సంచలన విషయాలని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి)'నేను గెలుచుకున్న ప్రైజ్మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? నెక్లెస్ విషయానికొస్తే టీమ్ గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు. ఏందన్నా ఇదంతా అని అడిగితే.. రూల్స్ రూల్సే అని చెప్పారు' అని పల్లవి ప్రశాంత్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.పల్లవి ప్రశాంత్ పాల్గొన్న ఏడో సీజన్ ప్రైజ్మనీ మొత్తం రూ.50 లక్షలు.. కానీ ఇదే సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన ప్రిన్స్ యావర్, సూట్ కేసు తీసుకుని స్వచ్ఛందంగా బయటకొచ్చేశాడు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం పోగా ప్రశాంత్ రూ.35 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో 40శాతం జీఎస్టీ కటింగ్ అంటే రూ.14 లక్షలు, కారుకి రూ.8.5 లక్షలు, నెక్లెస్కి రూ.5 లక్షలు తీసేస్తే ఇక మిగిలింది రూ.7.5 లక్షలు మాత్రమే వచ్చిందన్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. కానీ ఇతడు చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది అర్థం కావట్లేదు. బిగ్బాస్ యాజమాన్యం వైపునుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలి.ఇకపోతే పల్లవి ప్రశాంత్ గతంలో శివ అనే యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి భిన్నమైన కామెంట్స్ చేశాడు. 'డబ్బులిస్తానని ఇవ్వకుండా తినేశాడని అందరూ అంటున్నారు. నేను చేసిన సాయం ఎంతో ఏంటో ఇచ్చిన నాకు తెలుసు. తీసుకున్న వాళ్లకు తెలుసు. బిగ్బాస్ ద్వారా వచ్చిన డబ్బే కాదు జీవితాంతం నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలని అనుకున్నా, చేస్తున్నా. నా దయ వల్ల ఓ చెల్లి కాలేజీ ఫస్ట్ వచ్చానని నాకు ఫోన్ చేసింది. వాళ్లు ముందుకు వచ్చి అన్న సాయం చేశాడని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అందుకే అవన్నీ బయటపెట్టలేకపోతున్నా. వాళ్లు చదువుకోవడం నాకు ముఖ్యం. ఆ చెల్లి వీడియో ముందుకొచ్చి చెప్పను అని అన్నది కానీ అవసరం అయితే వస్తానంది. అలా చాలామంది ఉన్నారు. నేను చేస్తానన్న సాయం చేసేశాను ఇంకా చేస్తూనే ఉంటాను తప్ప లెక్కలు అడిగితే చెప్పలేను' అని గతంలో చెప్పాడు. మరి ఈ రెండింటిలో ఏదో నిజమో పల్లవి ప్రశాంతే చెప్పాలి.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు) -
'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బిగ్బాస్ షో మొదలవనుంది. వచ్చే నెల నుంచి 10వ సీజన్ షురూ కానుందని లేటెస్ట్గా ప్రోమో వదిలారు. ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం పక్కనబెడితే అగ్నిపరీక్ష కారణంగా సోషల్ మీడియాలో షోపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే జడ్జిల్లో ఒకరైన నవదీప్ని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? దీనికి ఏంటి కారణం?ఈ షో మొదలైన తర్వాత 8 సీజన్ల వరకు పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్యులని పలువురిని తీసుకున్నారు గానీ వారిని ఎలా ఎంపిక చేశారు లాంటివి బయటపెట్టలేదు. కానీ గతేడాది అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెట్టి, ఆరుగురు సామాన్యులని ఎంపిక చేసి షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో ఒకడైన కల్యాణ్ పడాల ఏకంగా విజేత కూడా అయ్యాడు. ఈసారి అలానే అగ్నిపరీక్ష పోటీ నిర్వహించారు. వేలాది అప్లికేషన్లు రాగా వాటిలో 70 మందిని ఎంచుకుని వాళ్లలో 15 మందిని ఫైనల్ చేశారు.ఆ 15 మంది ఎవరనేది జనాలకు కూడా పెద్దగా తెలీదు కాబట్టి ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. అయితే రిజెక్ట్ అయిన మిగిలిన 55 మందిలో ఉప్పల్ బాలు, అక్షయ్ లాంటి జనాలకు తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్లని ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో పక్కనబెడితే వీరిద్దరితో పాటు మరికొందరు ఏకంగా చిన్నాచితకా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ జడ్జిలైన నవదీప్, బిందుమాధవి, అభిజిత్లని ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు.ఓ షో కోసం ఒక వ్యక్తిని తీసుకోవాలా వద్దా అనేది జడ్జిలతో పాటు నిర్వహకులకు ఉండే చాలా లెక్కలపై ఆధారపడి ఉంటుంది. దీని వెనక పెద్ద తతంగం ఉంటుంది. కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టరీతినా ఏకంగా జడ్జిలనే తిడుతుండటం షోపై వ్యతిరేకత పెంచుతోంది. పోనీ ఈ ఇన్ఫుయెన్సర్లు ఏమైనా సమాజానికి పనికొచ్చేది చేస్తున్నారా అంటే కాదు. ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ వీడియోలో లేదంటే మోటివేషన్ వీడియోలో చేస్తూ ఫాలోవర్లని సంపాదించుకుంటున్నారు. అలాంటి వీళ్లు.. తమని రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.షో మొదలుకాకముందే ఇలా ఉందంటే.. ఒకసారి ప్రారంభమైన తర్వాత ఇంకెన్ని విమర్శలు, ట్రోల్స్ వస్తాయోననే సందేహం కలుగుతోంది. గతేడాది కల్యాణ్ పడాలని విజేత చేసినప్పుడే చాలామంది సందేహపడ్డారు. తనూజ విజేత కావాల్సిన కంటెస్టెంటే కానీ కల్యాణ్ ఎలా విన్నర్ అయ్యాడు అని మాట్లాడుకున్నారు. పోని షో అయిపోయిన తర్వాత విజేతలకు వరస ఛాన్సులు వచ్చాయా అంటే అలాంటిదేం జరగలేదు. ఒకటి రెండు అవకాశాలు వచ్చాయంతే! -
మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు
బిగ్బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 15) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్)ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జడ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు) -
వల్గర్ వీడియోలు.. దేనికి పనికొస్తాయని అడిగారు: ఉప్పల్ బాలు
శనివారం(ఆగస్టు 15) నుంచి బిగ్బాస్ తెలుగు అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రసారం కానుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు దీనిని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో మొత్తం 70 మంది సామాన్యులు పోటీపడగా వాళ్లలో 15 మందిని ఎంపిక చేశారు. వీళ్లకు పోటీలు పెట్టి ఐదారుగురిని బిగ్బాస్ 10వ సీజన్లోకి తీసుకోనున్నారు. అయితే తనకెలాంటి పోటీలు పెట్టకుండా అన్యాయంగా బయటకు పంపేశారని, దీనికి నవదీప్ కారణమని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు వరస వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో)'మిడిల్ క్లాస్ వాళ్లంటే మనసుండదా? మేం ఎన్నోరోజుల నుంచి కష్టపడి వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటే ఓ ప్రశ్న అడగకుండా, టాస్క్ పెట్టకుండా.. మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? అవి వల్గర్గా ఉంటాయి అని అన్నారు. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా లక్ష రూపాయలు దానం చేశారా? ఎవరైనా పెళ్లయితే పుస్తె మెట్టలు ఇప్పించారా? మీరెలా మాట్లాడతారు సర్? అంటే మిడిల్ క్లాస్ వాళ్లం ఏం చేయలేం? మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు. మేమే తోపులం అనుకుంటున్నారా? మీకు అవకాశమిస్తే మీరక్కడ కూర్చున్నారు. ఏదో ఒకరోజు మీకు శాపం తగులుతుంది. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. నవదీప్ గారు నేను అస్సలు వదిలిపెట్టను. అక్కడ ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి చెబుతాను. న్యాయం జరగాలి నాకు' ఉప్పల్ బాలు తన వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక) View this post on Instagram A post shared by BIGGBOSS10TELUGU (@officialbiggbosstelugu) -
మెడలో తాళితో 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ ప్రియాంక
బిగ్బాస్ తెలుగు 5వ సీజన్తో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్.. మెడలో తాళిబొట్టుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈమెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరిని పెళ్లి చేసుకుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)శ్రీకాకుళానికి చెందిన సాయితేజ తర్వాత కాలంలో లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్గా మారిపోయారు. కానీ ఈ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచానని గతంలో ఓసారి ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే బిగ్బాస్ 5లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో తానొక ట్రాన్స్జెండర్ అనే విషయం తన తండ్రికి తెలిసేలా బయటపెట్టింది.ఈ షో నుంచి బయటకొచ్చేసిన తర్వాత పలు రియాలిటీ షోల్లో కనిపించిన ప్రియాంక సింగ్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గానే ఉంటుంది. వ్రతాలు, పూజాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మెడలో తాళిబొట్టుతో కనిపించేసరికి సరదాగా ఇది పెట్టిందా? లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుందా అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
శరీరం మారింది... ఆలోచనలు మారాయి
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా మారి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పునర్నవి.. ఆపై పలు మూవీస్ చేసింది. కానీ బిగ్బాస్ తెలుగు షోతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో ఈమె కెమిస్ట్రీకి అప్పట్లో చాలా ఫ్యాన్ బేస్. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈ భామ.. చదువు, కెరీర్, పెళ్లితో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈమె.. తన శారీరక మార్పులపై ఇప్పుడు ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కాలక్రమేణా మనిషి శరీరంలో మార్పులు రావడం సహజమే. ఆలోచనలు, వ్యక్తిత్వం కూడా మారుతుందని చెప్పుకొచ్చింది."నా శరీరం మారింది. నా జీవితం కూడా మారింది. బహుశా జీవితంలో ఎప్పటికీ మారని ఒక్క విషయం 'మార్పు' మాత్రమే. వయసుతో పాటు నా మెటాబాలిజం(జీవక్రియ), హార్మోన్లలో మార్పులు వచ్చాయి. మొటిమలు రావడం, బరువు తరచూ మారడం వంటి శారీరక మార్పులను ఎదుర్కొన్నాను. అయితే ఇవన్నీ నన్ను మరింత మెచ్యూరిటీ ఉన్న మహిళగా తీర్చిదిద్దాయి. నాలోని స్త్రీత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. మనుషులని మరింతగా ప్రేమించడం నేర్చుకున్నాను. అవసరమైనప్పుడు దేనికైనా సరే లేదు అని చెప్పగలుగుతున్నాను. ఇతరులని సంతోషపెట్టడం కోసం జీవించే స్వభావాన్ని వదులుకున్నాను' అని పునర్నవి పేర్కొంది.InstagramPunarnavi B Kalidindi (@punarnavib) • Instagram photos and videospunarnavib on August 1, 2026: “Over the years my body changed, and so did I. I think that’s the only thing life has ever promised me, change. My metabolism changed. My hormones changing. I have acne. Weight fluctuates… -
ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్బాస్' శుభశ్రీ
తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో శుభశ్రీ రాయగురు ఒకరు. స్వతహాగా ఒడియా అమ్మాయి, లాయర్ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటిగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఒకటి రెండు మూవీస్లోనూ కనిపించింది. కానీ సక్సెస్ ఏం రాలేదు. ఇదే టైంలో ఆస్ట్రేలియాలో ఉంటున్న అజయ్ అనే భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతేడాది జూన్లో తన పెళ్లి సంగతి బయటపెట్టింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత గత వారం పదిరోజుల నుంచి అడపాదడపా పోస్టులు పెడుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో శుభశ్రీ ప్రెగ్నెన్సీతో ఉందా అని పలువురు ఫాలోవర్లు కామెంట్స్ చేశారు. దీంతో శుభశ్రీ ఏకంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. 'మీరు ప్రెగ్నెంటా' అని పదేపదే కామెంట్ పెడుతున్న సదరు నెటిజన్కి కౌంటర్ ఇచ్చింది. అదే టైంలో తానేం ప్రెగ్నెన్సీతో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) -
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్' షన్ను
యూట్యూబ్ నుంచి ఫేమస్ అయి ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న 'బిగ్బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)అయితే కొన్నిరోజుల క్రితం వైష్ణవితో కలిసి గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోల్లో పెళ్లి మండంపై నూతన వధూవరులిద్దరూ కనిపించారు.వైజాగ్కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్బాస్ షోలో పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్కే సినిమా చేసిన స్టార్ కమెడియన్) -
బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!
తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్గానే ఇన్స్టా సబ్స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ నడిచింది. మరోవైపు పలువురు ఈమెపై కేసులు కూడా పెట్టారు. ఇదంతా కొన్నాళ్ల క్రితం జరిగింది. దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఇదే విష్ణుప్రియ మరో వివాదంలోనూ ఇరుక్కుంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ)వివాదం జరగకముందు విష్ణుప్రియకు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఫాలోవర్స్ వందల్లో ఉండగా.. దీని తర్వాత అమాంతం పెరిగిపోయారు. తాజాగా రూ.399 కట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్తో లైవ్లో పాల్గొన్న ఈమె.. చాలానే మాట్లాడింది. ఓ సబ్స్క్రైబర్ ప్రశ్నకు బదులిస్తూ.. తన బాడీ కౌంట్ ఐదు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది.విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. మరి మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి? ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విష్ణుప్రియ మాటలపై ట్రోల్స్ గట్టిగానే నడుస్తున్నాయి. విష్ణుప్రియ కెరీర్ విషయానికొస్తే షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అలా గుర్తింపు తెచ్చుకుని యాంకర్ అయింది. చాలానే షోలు చేసింది. అలా బిగ్బాస్ తెలుగు 8వ సీజన్లోనూ పాల్గొంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు షోలు తప్పితే మరేం చేయట్లేదు.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్) -
మంగ్లీ ఎంట్రీ ఫిక్స్.. బిగ్ బాస్ హౌస్ లో మోత మోగనున్న ఫోక్ సాంగ్స్
-
ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఒక్క సాంగ్తో తెలుగులో ఈమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఐదారేళ్ల పాటు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. అలాంటి ముమైత్ అసలేమైపోయింది? ఇప్పుడేం చేస్తోంది? ఈమెకు పాకిస్తాన్ ఉన్న సంబంధమేంటి?(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలో. ఈమె అసలు పేరు ఇది కాదు ముంతాజ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని ముమైత్ అని మార్చుకుంది. 2001లో రిలీజైన తమిళ మూవీ 'మజ్ను'తో ఐటమ్ డ్యాన్సర్గా అరంగేట్రం చేసింది. తెలుగులో అయితే హరికృష్ణ హీరోగా నటించిన 'సామి'తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఛత్రపతి, యోగి, సామాన్యుడు, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యధన, నేనింతే, మగధీర తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఓ హీరో మూవీ వస్తుందంటే ముమైత్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లింది. అలా 2006-11 మధ్య కాలంలో ఏడాది ఐదారు సినిమాలు చేసింది.ఐటమ్ సాంగ్సే కాదు మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. అలాంటి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈమె సినిమాల్లో కనిపించడం మానేసింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ముమైత్.. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మానేశానని అంతా అనుకున్నారు. కానీ నేనెప్పుడూ సినిమాలు మానలేదు, మానాలని అనుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది. నా మెదడులో 5 నరాలు చిట్లాయి. ఈ ప్రమాదం తర్వాత కనీసం ఏడేళ్లు పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు. చిన్న వస్తువు మోయడం కూడా చాలా కష్టంగా అనిపించేది.ఈ ప్రమాదం తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. దేవుడు నన్ను ముమైత్ ఖాన్గా మార్చాడు. ఆయనే దీనంతటికీ ఫుల్స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరించాను. ఏడేళ్ల పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించాను. ఈ సమయంలో నన్ను మా అమ్మే చూసుకుంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. నా లైఫ్ స్టైల్ని మారకుండా చూసుకుంది. ఈ ఏడేళ్లలో నాకేం ఇష్టమనే విషయాలను బాగా తెలుసుకున్నా. నేను బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్కి, మేకప్ కిట్స్కి, స్టైయిలింగ్ టీమ్స్ని ముంబై నుంచి తెప్పించాల్సి వచ్చేది. వాటిని హైదరాబాద్లోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనతోనే వ్యాపారం మొదలెట్టా. ఇప్పుడు అదే నా కెరీర్గా ఎంచుకున్నానని గతంలో ముమైత్ చెప్పుకొచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికొస్తే ముమైత్ తల్లిది తమిళనాడు కాగా తండ్రిది పాకిస్తాన్. ముమైత్ పుట్టిన తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకి వచ్చేసింది. 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలెట్టిన ముమైత్ ఖాన్, చిన్నతనంలో ఆకలి కష్టాలని కూడా అనుభవించింది. బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొంది కానీ డ్రగ్స్ కేసు వల్ల మధ్యలో బయటకొచ్చి మళ్లీ షోలోకి వెళ్లింది. కానీ 49వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేయడం తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్బాస్ బ్యూటీ
తెలుగు బిగ్బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)'జబర్దస్త్' కమెడియన్గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్బాస్లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్బాస్లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ) -
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి నిశ్చితార్థం చేసుకుని పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉంది. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారైని మోసం చేసి రూ.9.5 కోట్లు తీసుకుందనే ఆరోపణలు ఈమెపై వచ్చాయి. ఈ వివాదం అలా ఉండగానే ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోలని అషు తన సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?)వైజాగ్కి చెందిన కొయ్య వెంకట అశ్విని రెడ్డి అలియాస్ అషురెడ్డి.. తొలుత సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొని బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఒకటి రెండు వీడియోలతో ఈమె చాలా విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ క్రేజ్ బాగానే వచ్చింది.కొన్నిరోజుల క్రితం ధర్మేంద్ర అనే ఎన్నారై తండ్రి సత్యనారాయణ.. అషురెడ్డి ఈమె కుటుంబంపై హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో తన కొడుకుని అషు మోసం చేసిందని, రూ.9.5 కోట్ల రూపాయలు తీసుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అషు.. హైకోర్టుని ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని, పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో పోలీసుల విచారణ ముమ్మరమైంది.ఇదంతా జరగుతుండగానే అషుకి సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో సెటిల్ చేసుకుందామని అషు అన్నట్లు ఉంది. తర్వాత ధర్మేంద్ర ఆడియో కూడా బయటకొచ్చింది. ఇప్పుడు అషురెడ్డి సడన్గా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫొటోలు రిలీజ్ చేయడంతో ఎవరా కుర్రాడు అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈమెకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేసి షాకిచ్చారు. అషురెడ్డితోపాటు ఆమె తల్లిదండ్రులు.. సోమవారం విచారణకు హాజరవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)'2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం''నేను వైజాగ్లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?) -
సంజనా గల్రానీ కూతురు బర్త్డేలో పాపులర్ ఎమ్మెల్యే (ఫోటోలు)
-
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
తెలుగు బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వరస షాకులిస్తోంది. చాన్నాళ్లుగా పెద్దగా బయట కనిపించని ఈమె.. 20 రోజల క్రితం తనకు పెళ్లయి ఏడాది పూర్తయిందని చెబుతూ భర్త ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటో చేసింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ట్రాన్స్జెండర్ తమన్నా.. భర్త ఎవరంటే?)విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. రెండు వారాలే ఈ షోలో ఉన్నప్పటికీ తోటి కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖితో స్నేహం కుదిరింది. షో అయిపోయి దాదాపు ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్లో తమన్నా ఒకరు.అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. ఈమె నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గాలో మొక్కుకున్నారు. అమ్మాయి లక్షణాలతో ఉన్న అబ్బాయి పుట్టాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబై వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని తమన్నా సింహాద్రిగా మారింది.ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అలా 2019లో లోకేశ్పై మంగళగిరిలో, 2024లో పవన్ కల్యాణ్పై పిఠాపురంలో పోటీగా నిలబడింది. కానీ ఓడిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నానని, స్పెషల్ ట్రీట్మెంట్ సక్సెస్ అని చెప్పేసరికి అసలు ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?) View this post on Instagram A post shared by Tamanna Simhadri official (@tamannasimhadri) -
సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)అయితే షన్ను పెళ్లి అయిన సంగతి అతడు గానీ, వైష్ణవి గానీ వెల్లడించలేదు. పెళ్లి ఫొటోలని షేర్ చేసిన ఫొటోగ్రాఫర్.. తన స్నేహితుడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడని చెప్పుకొచ్చాడు. దీంతో షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి అయిందనే విషయం తెలిసింది. ఈ ఫొటోల్లో వధూవరులిద్దరూ కనిపించారు గానీ తాళి కడుతున్న ఫొటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.వైజాగ్కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్బాస్ షోలో పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్) -
పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
తెలుగు బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ.. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు భర్త ఫొటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్లినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఫ్రెండ్స్తో పాటు పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా)విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు ఆరేళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్లో తమన్నా కూడా ఒకరు.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా.. నా నిజాయితికి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాలని చూడలేదని, ఆమెలో నా కూతురిని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. నా బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే.. శ్రీముఖి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్త ఎవరు? అతడి పేరు ఏంటి? తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను.ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెని చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది.ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేశ్పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు.(ఇదీ చదవండి: ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు) View this post on Instagram A post shared by Tamanna Simhadri official (@tamannasimhadri) -
అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా
సాధారణంగా యాంకర్స్, సీరియల్ నటులు.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. వీళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊహించని అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వాళ్లలో హరితేజ ఒకరు. 20కి పైగా సీరియల్స్లో నటించిన యాంకర్గానూ పలు ఈవెంట్స్ హోస్టింగ్ చేసింది. బిగ్బాస్ తొలి సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరసగా పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడంతో తను ఎలాంటి సాహసం చేశానో బయటపెట్టింది.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)'అల్లు అర్జున్ పక్కన స్లిమ్, ఫెర్ఫెక్ట్గా కనిపించాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. 'డీజే'(దువ్వాడ జగన్నాథం)లో అవకాశం వచ్చిన తర్వాత స్లిమ్గా కనిపించాలని వరసగా 15 రోజులు ఆహారం తినడం మానేశాను. కేవలం లిక్వ్డ్ డైటే తీసుకున్నాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను. షూటింగ్ రేపు ఉందనగా ముందురోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదు. ఇక సెట్లో జరిగిన సంఘటన అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. సెట్కి వెళ్లగానే అల్లు అర్జున్,నా దగ్గరకు వచ్చి 'బిగ్బాస్'లో నీ ఫెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది' అని అన్నారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను' అని హరితేజ.. బన్నీతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అఆ, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు హరితేజ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిగ్బాస్ 8వ సీజన్లో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా మళ్లీ వచ్చింది గానీ పెద్దగా మెప్పించకలేకపోయింది. ఏదేమైనా బన్నీ గురించి చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్)#HariTeja: I actually did a 15-day liquid diet just to look slim for #AlluArjun Garu on the ‘DJ’ I was so excited that I couldn't even sleep the day before the shoot he walked up & told me he loved my work in Bigg Boss I was over the moon!"#AA22 #AALoki #AA25 pic.twitter.com/bX2UGTH03g— 𝒱𝒜 𝒸𝓊𝓁𝓉 ᵏʰᵃᵈʰᵃʳ ˢᵗʸˡⁱˢʰ (@khadharkhan1982) February 27, 2026 -
'ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. అనుకున్నంత ఈజీ కాదు!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.అలానే రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అమర్దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'బిగ్బాస్' ఓట్లు దీనికి పనికిరావు.. అమర్దీప్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. గతేడాది కామనర్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అంతకు ముందు సీజన్లలో నిఖిల్, పల్లవి ప్రశాంత్ తదితరులు విన్నర్స్ అయ్యారు. గెలిచిన వాళ్లు ఏమైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతూ ఏడో సీజన్ రన్నరప్ అమర్దీప్ కుండబద్దలు కొట్టేశాడు. బిగ్బాస్ ఓట్లు దేనికి పనికిరావు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)'బిగ్బాస్లో ఓట్లు వేశారు కదా, వాళ్లంతా థియేటర్కి వచ్చేస్తారని మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసి ప్రేక్షకులని రప్పించుకోవాలి. అంతే గానీ ఆ ఓట్లు దీనికి పనికిరావు. ఆ షోలో గెలిచినా, టాప్-5లో ఉన్నా గానీ అదంతా ఒక్కరోజుకే. తర్వాత నుంచి అంతా సాధారణమే. ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, స్టేజీ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యమవ్వొచ్చు కానీ సక్సెస్ అయితే దొరుకుతుంది''బిగ్బాస్లో చేసిన వాళ్లందరూ హీరోలు అయ్యింటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ఈ షో అనేది వన్డే కింగ్. బయటకొచ్చిన తర్వాత ఎవడి జీవితం వాడిది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కాసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లేస్తారు' అని అమర్దీప్ చెప్పుకొచ్చాడు. ఇతడు మాట్లాడిన దానిబట్టి చూస్తే సొహెల్కి పరోక్షంగా కౌంటర్ వేశాడా అని సందేహం వస్తుంది. ఎందుకంటే బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన కొన్ని సినిమాలు చేసిన సొహెల్.. ఓ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. షోలు ఓట్లు వేశారు కదన్నా, సినిమాకు ఎందుకు రావట్లేదు అని అడిగాడు. ఇతడే కాదు సన్నీ తదితరులు కూడా హీరోగా ఒకటి రెండు మూవీస్ చేసి పూర్తిగా కనుమరుగైపోయారు. కాబట్టి బిగ్బాస్ ఫేమ్ అనేది నీటిపై బుడగ లాంటిదే. ఎప్పుడు పేలిపోతుందే చెప్పలేం!(ఇదీ చదవండి: #AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్) -
బిగ్బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!
తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. గతేడాది డిసెంబర్లో ముగిసిన ఈ సీజన్లో కామనర్గా హౌస్లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్ప్రైజ్ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ రన్నరప్గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్స్టార్లో 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్ మా టీవీ రేటింగ్స్లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.UNBEATABLE!! UNREACHABLE!! 🔥🔥🔥🔥🔥19.6 TVR on StarMaa, 285 million minutes on Jiostar 💥🔥The #BiggBossTelugu9 Grand Finale stands tall as the BIGGEST in the last 5 years.A season filled with emotions, passion, conflicts, and unforgettable moments. 🔥My heartfelt thanks to… pic.twitter.com/HlR4B56XTy— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 2, 2026 -
ఆఫ్ట్రాల్ నువ్వెవరు?.. రీతూపై ఓ రేంజ్లో రెచ్చిపోయిన సంజనా!
ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. గతవారంలో కామనర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు వారాల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ పదో వారంలో నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది.అయితే తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఇవాల్టి ఎపిసోడ్ ఫుల్ హాట్హాట్గా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్లో కమాండర్స్, ప్రజలు అని కంటెస్టెంట్స్ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టేందుకు బిగ్బాస్ సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కమాండర్లకు ఓ చిన్న పరీక్ష పెట్టాడు. నలుగురు కమాండర్స్ మధ్య బాల్స్ను బుట్టలో వేసే గేమ్ పెట్టాడు. ఈ గేమ్లో ఓడిపోయినవారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటోంది. ఎవరి బుట్టలో తక్కువ బాల్స్ ఉంటే వారు సేఫ్ అవుతారని ప్రకటించారు. ఈ గేమ్లో సంజనా, డిమాన్ పవన్, తనూజ, నిఖిల్ పోటీపడ్డారు.ఈ గేమ్ సందర్భంగా రీతూ చౌదరి, సంజనా మధ్య మాటల యుద్ధం నడించింది. నీకు కావాల్సిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావని సంజనా అనడంతో.. అందరూ నాకు కావాల్సిన వాళ్లే అంటూ రీతూ ఫైరయింది. నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదంటూ సంచాలక్ రీతూ మండిపడింది. దీనికి నా స్ట్రాటజీ నాది.. నా గేమ్ గురించి మాట్లాడానికి నువ్వెవరు అంటూ సంజనా అంతే రేంజ్లో ఇచ్చిపడేసింది. నా గేమ్ స్ట్రాటజీని ప్రశ్నించడానికి.. ఆఫ్ట్రాల్ నువ్వు ఎవరు? నీకేమి హక్కుంది అంటూ సంజనా శివంగిలా మాట్లాడింది. దీనికి రీతూ నేను ఆఫ్ట్రాల్ కాదు సంజనా గారు..ఐ యామ్ సంచాలక్ అంటూ రీతూ కూడా గట్టిగానే అరుస్తూ కౌంటరిచ్చింది. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ హాట్గా సాగినట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ప్రోమో మీరు కూడా చూసేయండి. House is filled with tough tasks! Get ready for a blast episode! 💥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/51OXUDOn8s— JioHotstar Telugu (@JioHotstarTel_) November 11, 2025 -
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్బాస్ తెలుగు తొలి సీజన్లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..) -
బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?
బిగ్బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్గా జరిగింది.కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
బిగ్బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!
ఈసారి బిగ్బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్బాస్పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్లో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్లా సంజనా) -
బిగ్బాస్ నామినేషన్స్.. కామనర్స్పై రెచ్చిపోయిన టెనెంట్స్!
బిగ్బాస్ మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కామనర్స్ నుంచి మర్యాద మనీశ్ హౌస్కు గుడ్ బై చెప్పేశాడు. ఇక మూడో వారం మొదటి రోజే హౌస్ మరింత హాట్హాట్గా మారిపోయింది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఓనర్స్, టెనెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఎంత హీటక్కిపోయిందో అర్థమవుతోంది.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు నువ్వు గేమ్లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. పక్కనోడి పర్సనల్ పాయింట్తో నాకేంటి? అంటూ గట్టిగానే కౌంటరిచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య చిన్నపాటి గొడవను తలపించింది. నువ్వు వెళ్లు అని శ్రీజ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి అంటూ రీతూ మండిపడింది. దీంతో వెంటనే మాస్క్ మ్యాన్ హరీశ్ ఎంట్రీ ఇచ్చాడు. మనందరినీ నామినేషన్స్లో పెట్టడమే వారి ఉద్దేశమని అన్నారు. దీనిపై రీతూ చౌదరి మరోసారి ఆవేశంతో ఊగిపోయింది. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఏ రేంజ్లో జరిగిందో అర్థమవుతోంది. Nominations heat rising! Owners and Tenants go head-to-head! 👁️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/CGio3EffLF— Starmaa (@StarMaa) September 22, 2025 -
‘ఏఐ కాదు..పక్కా ఒరిజినల్’..బిగ్బాస్ బ్యూటీ పిక్స్ వైరల్
-
బిగ్ బాస్ లోకి రీతూ చౌదరి ఫిక్స్..!
-
బిగ్బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్గా పాల్గొన్నాడు. రన్నరప్గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
బిగ్బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్) -
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
శోభా శెట్టి బర్త్డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
ముసలమ్మలా మారిపోయిన హాట్ బ్యూటీ అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)


