breaking news
Bigg Boss Telugu
-
'ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. అనుకున్నంత ఈజీ కాదు!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.అలానే రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అమర్దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'బిగ్బాస్' ఓట్లు దీనికి పనికిరావు.. అమర్దీప్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. గతేడాది కామనర్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అంతకు ముందు సీజన్లలో నిఖిల్, పల్లవి ప్రశాంత్ తదితరులు విన్నర్స్ అయ్యారు. గెలిచిన వాళ్లు ఏమైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతూ ఏడో సీజన్ రన్నరప్ అమర్దీప్ కుండబద్దలు కొట్టేశాడు. బిగ్బాస్ ఓట్లు దేనికి పనికిరావు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)'బిగ్బాస్లో ఓట్లు వేశారు కదా, వాళ్లంతా థియేటర్కి వచ్చేస్తారని మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసి ప్రేక్షకులని రప్పించుకోవాలి. అంతే గానీ ఆ ఓట్లు దీనికి పనికిరావు. ఆ షోలో గెలిచినా, టాప్-5లో ఉన్నా గానీ అదంతా ఒక్కరోజుకే. తర్వాత నుంచి అంతా సాధారణమే. ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, స్టేజీ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యమవ్వొచ్చు కానీ సక్సెస్ అయితే దొరుకుతుంది''బిగ్బాస్లో చేసిన వాళ్లందరూ హీరోలు అయ్యింటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ఈ షో అనేది వన్డే కింగ్. బయటకొచ్చిన తర్వాత ఎవడి జీవితం వాడిది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కాసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లేస్తారు' అని అమర్దీప్ చెప్పుకొచ్చాడు. ఇతడు మాట్లాడిన దానిబట్టి చూస్తే సొహెల్కి పరోక్షంగా కౌంటర్ వేశాడా అని సందేహం వస్తుంది. ఎందుకంటే బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన కొన్ని సినిమాలు చేసిన సొహెల్.. ఓ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. షోలు ఓట్లు వేశారు కదన్నా, సినిమాకు ఎందుకు రావట్లేదు అని అడిగాడు. ఇతడే కాదు సన్నీ తదితరులు కూడా హీరోగా ఒకటి రెండు మూవీస్ చేసి పూర్తిగా కనుమరుగైపోయారు. కాబట్టి బిగ్బాస్ ఫేమ్ అనేది నీటిపై బుడగ లాంటిదే. ఎప్పుడు పేలిపోతుందే చెప్పలేం!(ఇదీ చదవండి: #AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్) -
బిగ్బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!
తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. గతేడాది డిసెంబర్లో ముగిసిన ఈ సీజన్లో కామనర్గా హౌస్లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్ప్రైజ్ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ రన్నరప్గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్స్టార్లో 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్ మా టీవీ రేటింగ్స్లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.UNBEATABLE!! UNREACHABLE!! 🔥🔥🔥🔥🔥19.6 TVR on StarMaa, 285 million minutes on Jiostar 💥🔥The #BiggBossTelugu9 Grand Finale stands tall as the BIGGEST in the last 5 years.A season filled with emotions, passion, conflicts, and unforgettable moments. 🔥My heartfelt thanks to… pic.twitter.com/HlR4B56XTy— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 2, 2026 -
ఆఫ్ట్రాల్ నువ్వెవరు?.. రీతూపై ఓ రేంజ్లో రెచ్చిపోయిన సంజనా!
ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. గతవారంలో కామనర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు వారాల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ పదో వారంలో నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది.అయితే తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఇవాల్టి ఎపిసోడ్ ఫుల్ హాట్హాట్గా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్లో కమాండర్స్, ప్రజలు అని కంటెస్టెంట్స్ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టేందుకు బిగ్బాస్ సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కమాండర్లకు ఓ చిన్న పరీక్ష పెట్టాడు. నలుగురు కమాండర్స్ మధ్య బాల్స్ను బుట్టలో వేసే గేమ్ పెట్టాడు. ఈ గేమ్లో ఓడిపోయినవారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటోంది. ఎవరి బుట్టలో తక్కువ బాల్స్ ఉంటే వారు సేఫ్ అవుతారని ప్రకటించారు. ఈ గేమ్లో సంజనా, డిమాన్ పవన్, తనూజ, నిఖిల్ పోటీపడ్డారు.ఈ గేమ్ సందర్భంగా రీతూ చౌదరి, సంజనా మధ్య మాటల యుద్ధం నడించింది. నీకు కావాల్సిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావని సంజనా అనడంతో.. అందరూ నాకు కావాల్సిన వాళ్లే అంటూ రీతూ ఫైరయింది. నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదంటూ సంచాలక్ రీతూ మండిపడింది. దీనికి నా స్ట్రాటజీ నాది.. నా గేమ్ గురించి మాట్లాడానికి నువ్వెవరు అంటూ సంజనా అంతే రేంజ్లో ఇచ్చిపడేసింది. నా గేమ్ స్ట్రాటజీని ప్రశ్నించడానికి.. ఆఫ్ట్రాల్ నువ్వు ఎవరు? నీకేమి హక్కుంది అంటూ సంజనా శివంగిలా మాట్లాడింది. దీనికి రీతూ నేను ఆఫ్ట్రాల్ కాదు సంజనా గారు..ఐ యామ్ సంచాలక్ అంటూ రీతూ కూడా గట్టిగానే అరుస్తూ కౌంటరిచ్చింది. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ హాట్గా సాగినట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ప్రోమో మీరు కూడా చూసేయండి. House is filled with tough tasks! Get ready for a blast episode! 💥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/51OXUDOn8s— JioHotstar Telugu (@JioHotstarTel_) November 11, 2025 -
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్బాస్ తెలుగు తొలి సీజన్లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..) -
బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?
బిగ్బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్గా జరిగింది.కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
బిగ్బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!
ఈసారి బిగ్బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్బాస్పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్లో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్లా సంజనా) -
బిగ్బాస్ నామినేషన్స్.. కామనర్స్పై రెచ్చిపోయిన టెనెంట్స్!
బిగ్బాస్ మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కామనర్స్ నుంచి మర్యాద మనీశ్ హౌస్కు గుడ్ బై చెప్పేశాడు. ఇక మూడో వారం మొదటి రోజే హౌస్ మరింత హాట్హాట్గా మారిపోయింది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఓనర్స్, టెనెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఎంత హీటక్కిపోయిందో అర్థమవుతోంది.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు నువ్వు గేమ్లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. పక్కనోడి పర్సనల్ పాయింట్తో నాకేంటి? అంటూ గట్టిగానే కౌంటరిచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య చిన్నపాటి గొడవను తలపించింది. నువ్వు వెళ్లు అని శ్రీజ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి అంటూ రీతూ మండిపడింది. దీంతో వెంటనే మాస్క్ మ్యాన్ హరీశ్ ఎంట్రీ ఇచ్చాడు. మనందరినీ నామినేషన్స్లో పెట్టడమే వారి ఉద్దేశమని అన్నారు. దీనిపై రీతూ చౌదరి మరోసారి ఆవేశంతో ఊగిపోయింది. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఏ రేంజ్లో జరిగిందో అర్థమవుతోంది. Nominations heat rising! Owners and Tenants go head-to-head! 👁️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/CGio3EffLF— Starmaa (@StarMaa) September 22, 2025 -
‘ఏఐ కాదు..పక్కా ఒరిజినల్’..బిగ్బాస్ బ్యూటీ పిక్స్ వైరల్
-
బిగ్ బాస్ లోకి రీతూ చౌదరి ఫిక్స్..!
-
బిగ్బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్గా పాల్గొన్నాడు. రన్నరప్గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
బిగ్బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్) -
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
శోభా శెట్టి బర్త్డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
ముసలమ్మలా మారిపోయిన హాట్ బ్యూటీ అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)


