
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట/చిలప్చెడ్(నర్సాపూర్): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం చిలప్చెడ్ రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, కొన్ని రకాల భూ సమస్యలకు పరిష్కరమే లేదన్నారు. రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండానే రెవెన్యూ అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. భూధార్ కార్డులో భూ రికార్డులు, హద్దులు, మ్యాప్ అన్ని వివరాలు ఉంటాయన్నారు. రెవెన్యూ సిబ్బందిలో ఏ స్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టేక్మాల్ మండలంలోని రైతు వేదికలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలను తొలగించి, రైతులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తుందన్నారు. నిషేధిత భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములన్నింటికీ భూ భారతిలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. అంతకుముందు సదస్సుకు వచ్చి న రైతులు, తమ సందేహాలను ఉన్నతాధి కారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని ఎల్లుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పాపన్నపేట మండలం మల్లంపేటలో సైతం భూ భారతి కొత్త చట్టంపై రైతు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, అర్డీఓలు మహిపాల్, రమా, ఏడీఏ పద్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్