అర్బన్‌పార్కుకు హంగులు | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌పార్కుకు హంగులు

Apr 20 2025 7:53 AM | Updated on Apr 20 2025 7:53 AM

అర్బన

అర్బన్‌పార్కుకు హంగులు

నర్సాపూర్‌ అడవులను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అర్బన్‌పార్కు సందర్శకులకు ఆహ్లాదం పంచుతుండగా.. పార్కు ఆవరణలో రెండు దఫాలుగా కాటేజీల నిర్మాణం చేపట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మరిన్ని వసతులు సమకూరే అవకాశం ఉంది.

– నర్సాపూర్‌

పర్యాటకుల కోసం కాటేజీలు, ఇతర వసతులు

చివరి దశకు చేరిన పనులు

వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం

ర్సాపూర్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన అటవీశాఖ అధికారులు 258 హెక్టార్ల అడవులు కేటాయించి అర్బన్‌పార్కుగా అభివృద్ధి చేశారు. కనుచూపు మేర పరుచుకున్న అడవులు కనివిందు చేస్తుండగా.. రాయరావు చెరువు, పట్టణాన్ని వీక్షిస్తూ పర్యాటకులు ఆహ్లాదం పొందుతున్నారు. పార్కును సందర్శించే వారికి టికెట్‌ నిర్ణయించి అనుమతిస్తున్నారు. మామూలు రోజుల్లో రోజుకు 70 నుంచి 80 మంది, సెలవు రోజుల్లో 140 నుంచి 160 మంది వరకు అర్బన్‌ పార్కును సందర్శిస్తున్నారు. వారికి బస, భోజన వసతి కోసం కాటేజీలు, రెస్టారెంట్‌, ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌

మురుగన్‌ సంస్థకు బాధ్యతలు

పాత కాటేజీలు సరిపోవనే అభిప్రాయాలు రావడంతో తాజాగా 21 పాండ్‌ కాటేజీల నిర్మాణానికి అటవీశాఖ శ్రీకారం చుట్టింది. కొత్త వాటి నిర్మాణంతో పాటు పాత కాటేజీల నిర్వహణ బాధ్య తలను మురుగన్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నీరు నిల్వ ఉండే చోటును ఎంపిక చేసి నీటిపై కొంత ఎత్తులో కాటేజీల నిర్మాణ పనులు చేపట్టారు. వాటి పనులు చివరి దశకు చేరాయి. పాత కాటేజీలకు కొత్త పాండ్‌ కాటేజీలకు మధ్య ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, సెమినార్‌ హాల్‌, ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకునేందుకు సదుపాయాలు, స్విమ్మింగ్‌ పూల్‌, ఓపెన్‌ థియేటర్‌ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయా నిర్మాణ పనులు కొన సాగుతున్నాయి. కొత్తగా చేపట్టిన పాండ్‌ కాటేజీల పనులు పూర్తవగానే వాటిని ప్రారంభించాలని, పాత కాటేజీల ఆధునీకరణ పనులు తర్వాత చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రూ. 2 కోట్లు.. 11 కాటేజీలు..

పర్యాటకులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. గతంలో రూ. 2 కోట్ల వ్య యంతో 11 కాటేజీలు నిర్మించింది. వాటిలో కిచెన్‌, డైనింగ్‌ హాలు, రిసెప్షన్‌ ఉండేలా.. ఆరు కాటేజీలను నిర్మించారు. అయితే అవి నిర్మించి సుమారు రెండేళ్లు కావొస్తున్నా పలు కారణాలతో అందుబాటులోకి తేలేకపోయా రు. పర్యాటకపరంగా ఇప్పటివరకు ఉన్న కాటేజీలు సరిపోవనే ఉద్దేశంతో మరిన్ని నిర్మిస్తున్నారు. అయితే గతంలో నిర్మించిన వాటిని ఆధునీకరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

అర్బన్‌పార్కుకు హంగులు1
1/1

అర్బన్‌పార్కుకు హంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement