
డబుల్ బెడ్రూంలు కేటాయించాలి
చేగుంట(తూప్రాన్): అర్హులకు డబుల్బెడ్రూంలు కేటాయించాలని కోరుతూ మండల కేంద్రంలో సోమవారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం చేగుంటలో లబ్ధిదారుల సర్వే నిర్వహించి అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఇళ్లు కేటాయించకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంపిక చేసిన వారికి ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ సమస్య ఏర్పడగా, పోలీసులు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.