బీటీ రణదివెకు నివాళి | - | Sakshi
Sakshi News home page

బీటీ రణదివెకు నివాళి

Apr 7 2025 11:11 AM | Updated on Apr 7 2025 11:11 AM

బీటీ రణదివెకు నివాళి

బీటీ రణదివెకు నివాళి

మెదక్‌ కలెక్టరేట్‌: భారత కార్మికవర్గ ఐక్య పోరాటాల రథసారధి బీటీ రణదివె వర్ధంతిని ఆదివారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. రణదివె మరణించే వరకూ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమమే ఊపిరిగా సాగిందన్నారు. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. ఉద్యమాల్లో భాగంగా అనేకసార్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ కార్మిక నేత రణదివే అని కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లేశం, సంతోష్‌, అజయ్‌, చౌకత్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement