
ప్రత్యామ్నాయ తడులు పెట్టాలి
నర్సాపూర్: ఎండ తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి ఉన్న పొలాలకు ప్రత్యామ్నాయ తడులు పెడుతూ వరి పంటను కాపాడుకోవాలని ఏడీఏ సంధ్యారాణి హితవు పలికారు. ఆమె బుధవారం మండలంలోని లింగాపూర్, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. పలువురు రైతుల వరి పంట పొలాలను పరిశీలించి సలహాలు ఇచ్చారు. వరి పంటకు అవసరం మేరకు నీరు పెట్టాలని సూచించారు. ఆమె వెంట ఏఈఓలు దుర్గాప్రసాద్, చంద్రవేణి తదితరులు ఉన్నారు.
ఓటరు నమోదుకు అవకాశం
నర్సాపూర్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరుగా అర్హులందరూ పేర్లు నమోదు చేసుకునే విధంగా పార్టీల నాయకులు చూడాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ కార్డు సంధానం ప్రక్రియకు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎపిక్ సీనియర్ అసిస్టెంట్ నరేందర్రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యానికి నివాళి
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతిని బుధవారం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం మల్లు స్వరాజ్యం ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలు, భూస్వాములు, రజాకారులకు వ్యతిరేకంగా గ్రామాలలో సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్వరాజ్యం చూపిన పోరాట పటి మతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్, నాయ కులు సత్యం, రాణి తదితరులు పాల్గొన్నారు.
పరిశోధనకు సహకారం
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన వర్ష బయోసైన్స్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య బుధవారం పరస్పర సహకార అవగాహన ఒప్పందం కుదిరింది. ములుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి, వీబీటీఐపీఎల్ ప్రతినిధులు డాక్టర్ దేశాయ్, వెంకటేశ్వర్రావు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. మాస్టర్స్, డాక్టోరల్ అధ్యయనాలను అభ్యసించే విద్యార్థుల కోసం సహకార పరిశోధనా వాతావరణాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, రాజశేఖర్, శ్రీనివాసన్, వీరాంజనేయులు, విజయ లక్ష్మీనారాయణ, సైదయ్య, వీణాజోషి, జాన్పీటర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ తడులు పెట్టాలి

ప్రత్యామ్నాయ తడులు పెట్టాలి