శ్రీరాంపూర్: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష వెంటనే నిర్వహించేలా యాజమాన్యంతో మాట్లాడాలని ఇంటర్నల్ అభ్యర్థులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును కోరా రు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 మార్చిలో ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు కూడా స్వీకరించారన్నారు. కానీ పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో తాము ఉద్యోగానికి చాలా రోజులుగా సెలవులు పెడుతూ ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు.


