వైభవంగా సదల్‌పూర్‌ జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సదల్‌పూర్‌ జాతర

Jan 14 2026 7:22 AM | Updated on Jan 14 2026 7:22 AM

వైభవంగా సదల్‌పూర్‌ జాతర

వైభవంగా సదల్‌పూర్‌ జాతర

కై లాస్‌నగర్‌(బేల): బేల మండలంలోని సదల్‌పూర్‌లో అతిపురాతనమైన భైరాందేవ్‌ మహాదేవ్‌ ఆలయంలో ఏటా పుష్యమాసంలో నిర్వహించే జంగి జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. కొరంగే వంశస్తులు, సర్పంచ్‌ దంపతులు ఆదివాసీల సంప్రదాయం ప్రకారం డప్పుచప్పుళ్లు, భజనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఈ నెల 19 వరకు కొనసాగనుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు కోరంగే సోనేరావ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆశన్న రచించిన సదలేశ్వర శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ శ్యామ్‌రావ్‌, సర్పంచ్‌ మర్సకోల మంగేష్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement