అనాథ శవానికి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అనాథ శవానికి అంత్యక్రియలు

Jan 13 2026 5:51 AM | Updated on Jan 13 2026 5:51 AM

అనాథ శవానికి అంత్యక్రియలు

అనాథ శవానికి అంత్యక్రియలు

● ఉదారత చాటుకున్న వార్డు సభ్యుడు

జన్నారం: అనారోగ్యంతో మృతి చెందిన అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి ఉదారత చాటుకున్నాడు. జన్నారం మండలం పోన్కల్‌ గ్రామ పంచాయతీలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న నారపాక శ్రీను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న పీసీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించాడు. అనాధలు, నిరుపేదలను ఆదుకునేందుకు పీసీఆర్‌ ఫౌండేషన్‌ ముందుంటుందన్నారు. కాగా ప్రవీణ్‌కుమార్‌ను సోషల్‌ మీడియా వేధికగా పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement