ఆలిండియా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కర్ణాటకలోని బెంగళూర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్స్లో నిర్వహించే 85వ ఆలిండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2025–26 పోటీలకు మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని శృతి ఎంపికై ంది. ఈ నెల 12 నుంచి జరిగే పోటీల్లో 200 మీటర్ల పరుగుపందెంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి శృతిని కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, పీడీ నూనె శ్రీనివాస్ అభినందించారు.


