జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి

Jan 9 2026 7:40 AM | Updated on Jan 9 2026 7:40 AM

జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి

జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి

శ్రీరాంపూర్‌: జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలని రామగుండం రీజియన్‌ సీఎంీపీఎఫ్‌ కమిషనర్‌ కే గోవర్ధన్‌ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయంలో సీఎంపీఎఫ్‌కు సంబంధించిన ప్రయాస్‌ కార్యక్రమంలో భాగంగా జీరో పెండెన్సీ లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్‌ లావాదేవీలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రిటైర్డ్‌ ఉద్యోగుల క్‌లైమ్‌లను సీ కోర్సు పోర్టల్‌ ద్వారా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా 266 రివైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ కాపీలు అందించారు. శ్రీరాంపూర్‌ డీజీఎం (పర్సనల్‌) ఎస్‌.అనిల్‌కుమార్‌, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి ఎం.కొమురయ్య, సీనియర్‌ పీవో ఎస్‌.సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement