గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Jan 8 2026 8:55 AM | Updated on Jan 8 2026 8:55 AM

గిరిజ

గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

● రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ● ఏటూరు నాగారంలో రాష్ట్రస్థాయి 6వ గిరిజన క్రీడలు ప్రారంభం

ఏటూరునాగారం: కుమురం భీంను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అండర్‌ –14, 17 విభాగాల్లో 6వ రాష్ట్రస్థాయి (భద్రాద్రి కొత్తగూడెం, ఉట్నూర్‌, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏలు, 10 ప్లేన్‌ ఏరియాలు) గిరిజన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. కాగా అండర్‌– 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో జోన్‌–2 (ఏటూరునాగారం)కు చెందిన చరణ్‌ ప్రథమస్థానం, జోన్‌ –1(భద్రాచలం)కు చెందిన సోను ద్వితీయస్థానం, ధీరజ్‌ తృతీయస్థానం సాధించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తో పాటు ఇతర క్రీడలూ ప్రారంభమయ్యాయి.

గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి1
1/1

గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement