
ఉపాధి కల్పనకు కృషి
కార్మిక, గనుల శాఖల మంత్రిగా సింగరేణి సంస్థ, కార్మికుల విషయంలో మీ ప్రణాళికలు ఏంటి?
మంత్రి: సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా గనులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఓపెన్ కాస్ట్ల కంటే భూగర్భ గనులతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశగా సింగరేణి యాజమాన్యంతో చర్చించి స్థానికులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటా.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మికులకు సౌకర్యాలు, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కార్మిక, గనుల శాఖ కేటాయింపు తర్వాత శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన వివేక్వెంకటస్వామికి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వివిధకార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి, అన్నయ్య వినోద్, ఆ తర్వాత తనకు కార్మిక శాఖ మంత్రిగా పని చేసే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థతో మరిన్ని కొత్త గనులు ప్రారంభించి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మంత్రిగా మీ ప్రాధాన్యతలు ఏంటి?
మంత్రి: చెన్నూరు నియోజకవర్గంలో ఇన్నాళ్లు సరిగా రోడ్లు కూడా లేకుండే. ప్రజలు ఇబ్బంది పడొద్దని ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు మొదలుపెట్టాను. పట్టణాలకు తాగునీటి సమస్య లేకుండా అమృత్స్కీం కింద ఇంటింటికీ స్వచ్ఛనీరు అందిస్తాను. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చుతాను. సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు నీటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తాను.
దళితులకు ఉపాధి కల్పించే మందమర్రిలోని తోళ్ల పరిశ్రమను తెరిపిస్తారా?
మంత్రి: రాష్ట్ర లెదర్ కార్పొరేషన్కు ప్రస్తుతం చైర్మన్ లేరు. నియామకం కావాల్సి ఉంది. ఇ ప్పటికే తోళ్ల పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పన కోసం శిక్షణ, యువతకు అవకాశాలపై అధికా రులతో చర్చించా. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కలిగేలా చేస్తా.
మందమర్రి పట్టణానికి ఎన్నికలు నిలిచి ఏళ్లుగా పెండింగ్లో ఉంది?
మంత్రి: మందమర్రి పట్టణానికి ఎన్నికలు ని ర్వహించేందుకు కృషి చేస్తున్నాను. సుప్రీంకో ర్టులో కేసు ఉన్నందున అడ్వకేట్ జనరల్ను క లసి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాను. త్వరలోనే సమస్య పరిష్కారం చేసేలా ప్రయత్నిస్తా.
చెన్నూరుపై ప్రత్యేక దృష్టి
సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించాలి
‘సాక్షి’తో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి