జన్నారం ఎఫ్‌డీవోగా రామ్మోహన్‌ | - | Sakshi
Sakshi News home page

జన్నారం ఎఫ్‌డీవోగా రామ్మోహన్‌

Jun 15 2025 7:30 AM | Updated on Jun 15 2025 7:30 AM

జన్నారం ఎఫ్‌డీవోగా రామ్మోహన్‌

జన్నారం ఎఫ్‌డీవోగా రామ్మోహన్‌

● ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీఎఫ్‌ ● 20 నెలల తర్వాత నియామకం

జన్నారం: కవ్వాల్‌ టైగ ర్‌ రిజర్వులోని మంచి ర్యాల జిల్లా జన్నారం ఫారెస్టు డివిజల్‌ అధికా రి(ఎఫ్‌డీవో)గా ఎం.రా మ్మోహన్‌ను నియమి స్తూ రాష్ట్ర ముఖ్య అట వీశాఖ అధికారి(పీసీసీఎఫ్‌) సి.సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్‌ హైదరాబాద్‌లోని దూలపల్లి శిక్షణ అకాడమీలో రేంజ్‌ ఆఫీసర్‌ హోదాలో ఉంటూ కోర్సు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10మంది సీనియర్‌ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించగా.. ఇందులో రామ్మోహన్‌ను పదోన్నతితో ఎఫ్‌డీవోగా నియమించారు. గత 2023అక్టోబర్‌లో ఇక్కడ ఎఫ్‌డీవోగా పనిచేసిన ఎస్‌.మాధవరావును హైదరా బాద్‌లోని రాష్ట్ర ముఖ్య అటవీశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి 20నెలలుగా మంచిర్యాల డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌ అ దనపు బాధ్యతలతో ఇన్‌చార్జి ఎఫ్‌డీవోగా ఉన్నారు. ఎట్టకేలకు రామ్మోహన్‌ను జన్నారం ఎఫ్‌డీవోగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement