
రెడ్క్రాస్ సొసైటీకి అవార్డులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి అరుదైన అవార్డు లభించింది. రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఉన్న సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సొసైటీ సభ్యులకు అవార్డు అందజేశారు. స్వచ్ఛంద రక్తదాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రక్తదాన శిబిరాల నిర్వాహకుల కృషితో రాష్ట్రంలోనే అత్యధిక రక్త నిల్వలు సేకరించడంలో రెండోస్థానంలో నిలవడంతో అవార్డు దక్కింది. దీంతోపాటు రక్తదాన శిబిరంలో ఎక్కువ మంది స్వచ్ఛంద రక్తదాతలను సేకరించడం, ప్రభుత్వ రంగ సంస్థ కేటగిరీలో రామగుండం పోలీసు కమిషనరేట్, ప్రైవేటు రంగ సంస్థ కేటగిరీలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ దేవాపూర్లకు అవార్డులు అందజేశారు. మంచిర్యాల రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డిని అభినందించారు.