ఇన్‌చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు? | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు?

Jun 16 2025 6:59 AM | Updated on Jun 16 2025 6:59 AM

ఇన్‌చ

ఇన్‌చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు?

● పీజీ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు ● ఏడేళ్లుగా ఇదే పరిస్థితి.. ● విద్యా ప్రమాణాలపై ప్రభావం

చెన్నూర్‌: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా మండలాల్లో పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఇన్‌చార్జీలే చూసుకోవాల్సిన పరిస్థితి. గత ఏడేళ్లుగా జిల్లాలో రెగ్యులర్‌ మండల విద్యాధికారుల(ఎంఈవోల) నియామకాలు జరగడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఇన్‌చార్జి ఎంఈవోలే చూసుకోవాల్సి వస్తోంది. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు గతేడాది సీనియర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ హెడ్‌మాస్టర్ల(పీజీ హెచ్‌ఎంల)ను ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమించారు. అయితే పనిభారం పెరిగి వారు సతమతం అవుతున్నారు.

అదనపు బాధ్యతలతో ఇబ్బందులు..

పీజీ హెచ్‌ఎంలు తమ సొంత పాఠశాలల నిర్వహణతోపాటు మండలస్థాయిలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సి ఉంది. నూతన విద్యా విధానం అమలు, మధ్యాహ్న భోజన కార్యక్రమం, హరితహారం వంటి పథకాల నిర్వహణ, ప్రతీ సోమవారం ప్రజావాణి, మండల పరిషత్‌ సమావేశాలు, కలెక్టర్‌, డీఈవోల సమీక్షలకు హాజరు కావడం వంటి బాధ్యతలు వారిపై ఉన్నాయి. ఈ బాధ్యతల మధ్య విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి సమాచారాన్ని సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ పనిభారంతో పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా జరగక, విద్యా నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

తల్లిదండ్రుల ఆందోళన

పాఠశాలల ప్రారంభం నుంచి విద్యార్థులకు కనీస సామర్థ్యాల సాధన, గుణాత్మక విద్య, స్మార్ట్‌, డిజిటల్‌ క్లాస్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. అయితే, ఇన్‌చార్జి ఎంఈవోలపై అధిక బాధ్యతలు ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ సరిగా జరగడం లేదు. ఉత్తమ ఫలితాలు రావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులర్‌ ఎంఈవోల

నియామకానికి వినతి..

ప్రభుత్వం ఏడేళ్లుగా రెగ్యులర్‌ ఎంఈవోలను నియమించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. పాఠశాలల బలోపేతం, విద్యా నాణ్యత పెంపు కోసం రెగ్యులర్‌ మండల విద్యాధికారులను నియమించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఈ చర్య విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు.

రెగ్యులర్‌గా నియమిస్తే..

ఇన్‌చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నాం. పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం రెగ్యులర్‌ మండల విద్యాధికారులను నియామిస్తే పీజీ హెచ్‌ఎంలపై పనిభారం తప్పుతుంది.

– కొమ్మెర రాధాకృష్ణమూర్తి, ఇన్‌చార్జి

ఎంఈవో చెన్నూర్‌

ఇన్‌చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు?1
1/1

ఇన్‌చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement