
● 2022లో మంచిర్యాల కళాశాలకు అనుమతి ● ఇప్పటికీ కానరాని వ
అనుమతులు వచ్చేలా కృషి
మెడికల్ కళాశాలకు అవసరమైన అన్ని వసతులతో కూడిన సొంత భవన నిర్మాణ పనులు, ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో మూడు నెలల్లో కాలేజీ భవనం, ఐదు నెలల్లో ఆస్పత్రి భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ఎంసీ నుంచి అభ్యంతరాలు వచ్చినా, భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉండడంతో, ఈ ఏడాది ఎంబీబీఎస్లో సీట్లకు అనుమతులు వచ్చేలా కృషి చేస్తున్నాం. భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వచ్చే ఏడాది ఎన్ఎంసీ 150 సీట్లకు అనుమతిచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ ఎండీ.సులేమాన్,
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విస్తరణలో భాగంగా 2022లో మంచిర్యాలలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. అదే ఏడాది ఎంబీబీఎస్ మొద టి సంవత్సరంలో 100 సీట్లు కేటాయించింది. వాటిని భర్తీ చేశారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొ త్త మెడికల్ కాలేజీలకు 150 సీట్లు కేటాయించాల్సి ఉండగా, మంచిర్యాల కాలేజీలో పూర్తిస్థాయి వసతులు లేక మూడేళ్లుగా 100 సీట్లతోనే కొనసాగుతోంది.
మార్కెట్ యార్డులో కాలేజీ..
మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న వ్య వసాయ మార్కెట్ యార్డును మెడికల్ కాలేజీ కో సం కేటాయించారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తు ల నిల్వ కోసం రేకులతో నిర్మించిన గోదాములను తరగతి గదులు, ల్యాబ్లు, కాన్ఫరెన్స్ హాల్, ప్రిన్సి పల్, స్టాఫ్ గదులుగా 2022 మార్చిలో కాలేజీని ప్రా రంభించారు. కాలేజీకి అనుబంధంగా జిల్లా ఆస్పత్రిని 200 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 150 పడకలతో అనుబంధంగా కొనసాగిస్తున్నారు.
ఎన్ఎంసీ తనిఖీల్లో లోపాలు బహిర్గతం..
2023లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ముందు ఎన్ఎంసీ నిర్వహించిన తనిఖీల్లో కాలేజీ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రేకుల గోదాముల్లో కాలేజీ నిర్వహణ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన వా ర్డులు, ల్యాబ్లు, మౌలిక వసతుల లేమిపై ఎన్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి తనిఖీల్లోనూ ఇవే లోపాలను గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు, యూజీఎంఈబీ డైరెక్టర్ హాజరు కావాలని ఎన్ఎంసీ ఆదేశించింది. మంచిర్యాల కాలేజీ ప్రిన్సిపాల్, డీన్ వర్చువల్గా విచారణలో పాల్గొననున్నారు.
నిర్మాణ పనులలో జాప్యం..
ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని గుడిపేట్లో కొత్త మెడికల్ కాలేజీ భవన నిర్మాణం, కాలేజీ రోడ్డులో 450 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మా ణం రూ.500 కోట్లతో 2023లో ప్రారంభమైంది. అయితే, ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో భవనాలు అందుబాటులోకి రాలేదు. ఈ ఆలస్యం ఎన్ఎంసీ అసంతృప్తికి కారణమైంది.
వసతుల లేమి..
ప్రస్తుత కాలేజీలో అధ్యాపకులు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు, సీసీటీవీ వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమై న ప్రాక్టికల్ శిక్షణకు తగిన రోగులు, మృతదేహాలు, వివిధ విభాగాలకు చెందిన వైద్య సౌకర్యాలు లేవు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, ఆర్థో సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల వ్యాధులపై ప్రాక్టికల్ అవగా హన కోసం అవసరమైన సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల విద్యను ప్రభావితం చేస్తోంది.
మరో ఆరు నెలలు..
వచ్చే ఏడాది కల్లా కొత్త భవనం, 450 పడకలతో ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రి పూర్తయితే ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ నిర్వహణ సాధ్యమవుతుంది. అయితే, నూతన భవనం అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలలకుపైగా సమ యం పట్టనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్ల కే టాయింపుపై ఎన్ఎంసీ అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం ఉంది. అధికారులు సీట్ల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, వసతుల ఏర్పాటు వరకు సవాళ్లు తప్పేలా లేవు.

● 2022లో మంచిర్యాల కళాశాలకు అనుమతి ● ఇప్పటికీ కానరాని వ

● 2022లో మంచిర్యాల కళాశాలకు అనుమతి ● ఇప్పటికీ కానరాని వ