
సొంతింటి కల నెరవేరుస్తాం
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయిన సొంత ఇంటి పథకం అమలు చేస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య తెలిపారు. నస్పూర్లోని ప్రెస్క్లబ్లో ఆదివారం మాట్లాడారు. కార్మికుల ప్రధాన డిమాండ్లను తమ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి సమస్యలు వివరించినట్లు తెలిపారు. సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. సింగరేణి సొంతంగా ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లో కంపెనీ సూపర్ స్పెలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కార్మికులు, వారి కుటుంబాలకు చికిత్స అందించాలని విన్నవించినట్లు తెలిపారు. కార్మికుల అలవెన్స్లపై ఆదాయ పన్ను కంపెనీ రీయింబర్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేట్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, కేంద్ర ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్, భీంరావు, గరిగె స్వామి, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, కేంద్ర నాయకులు తిరుపతిరాజు, రామ్శెట్టి నరేందర్, అశోక్, మోహన్ పాల్గొన్నారు.