సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

Jun 16 2025 6:59 AM | Updated on Jun 16 2025 6:59 AM

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

● సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

నస్పూర్‌: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ స భ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మండల మహాసభలను పట్టణంలోని నర్సయ్య భవన్‌లో ఆదివారం నిర్వహించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు షిర్కే చౌరస్తా నుంచి నర్సయ్య భవన్‌ వర కు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మూడు గ్యారెంటీలను మాత్రమే అమలు చేసిందన్నారు. రైతులకు, కా ర్మికులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ నిలిపి మావోయిస్టులతో చ ర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రాబోయే స్థాని క సంస్థల ఎన్నికల్లో సీపీఐ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఆగస్టు 22, 23 తేదీల్లో మేడ్చల్‌లో పార్టీ రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్‌లో చంఢీఘర్‌లో జాతీయ మహాసభలు జరుగుతాయని వెల్ల డించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నాయకులు మేకల దాసు, జోగుల మల్లయ్య, లింగం రవి రేగుంట చంద్రశేఖర్‌, ము స్కె సమ్మయ్య, ఎస్కె బాజీసైదా, రేగుంట చంద్రకళ, దొడ్డిపట్ల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మండల కార్యదర్శిగా జోగుల మల్లయ్య

మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శిగా లింగం రవి ఎన్నికయ్యారు. మొత్తం 69 మందిని కౌన్సిల్‌ సభ్యులుగా, 23 మందిని నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement