న్యాయం కోసం ఊరంతా ఏకమై.. | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం ఊరంతా ఏకమై..

Jun 16 2025 6:59 AM | Updated on Jun 16 2025 6:59 AM

న్యాయం కోసం ఊరంతా ఏకమై..

న్యాయం కోసం ఊరంతా ఏకమై..

● కారోబార్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలని కొండాపూర్‌లో ఆందోళన ● పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రాస్తారోకో

దండేపల్లి: మండలంలోని కొండాపూర్‌ గ్రామ పంచాయతీ కారోబార్‌ ప్రభాకర్‌పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆది వారం ఆందోళన చేశారు. న్యాయం కోసం ఊరంతా ఏకమై నాలుగు ట్రాక్టర్లలో దండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

దాడి ఘటన వివరాలు

కొండాపూర్‌ గ్రామానికి చెందిన బారతపు సత్తవ్వతో అదే గ్రామానికి చెందిన బారతపు లింగయ్య, కు మారస్వామి, అమృత, గంగలక్ష్మి భూమి విషయంలో శనివారం గొడవకు దిగారు. సత్తవ్వపై దాడి జరుగుతుండగా, ఆమె మరిది, గ్రామ పంచాయతీ కారోబార్‌ ప్రభాకర్‌ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయి తే, నిందితులు ఇనుప రాడ్‌తో ప్రభాకర్‌పై దాడి చే యడంతో అతని తల, చేతికి తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గ్రామస్తుల నిరసన

నిందితులను రిమాండ్‌ చేయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని రహదారిపై బైఠాయించి, నిందితులను జైలుకు పంపాలని డి మాండ్‌ చేశారు. ఈ నిరసన కారణంగా రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ప్రభాకర్‌కు న్యాయం చేయాలని పట్టుబట్టారు.

పోలీసుల స్పందన

ఈ ఘటనపై దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్‌, గ్రామస్తులతో చర్చించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెడికల్‌ రిపోర్టు రానందున నిందితులను రిమాండ్‌ చేయలేదని తెలిపారు. ఎస్సై వివరణపై అసంతృప్తి చెందిన గ్రామస్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలివెళ్లారు. అనంతరం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఘటనా స్థలా నికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement